“అత్తారిల్లు” ఆల్ ఏరియా రైట్స్ సొంతం చేసుకున్న శ్రీలక్ష్మి పిక్చర్స్ బాపిరాజు
- August 06, 2016
అంజన్ కళ్యాన్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంలో మెలోడీబ్రహ్మ మణిశర్మ నేపధ్యసంగీతంలో అంజన్ కే కళ్యాణ్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించిన “ అత్తారిల్లు ” చిత్రానికి సంబందించిన ఆల్ ఏరియా రైట్స్ ను శ్రీలక్ష్మిపిక్చర్స్ అదినేత బాపిరాజు సొంతం చేసుకున్నారు.. ఈ సందర్భంగా బాపిరాజు సంతోషం వ్యక్తం చేస్తూ శ్యాం ప్రసాద్ రెడ్డి , కృష్ణ వంశీ , రాంగోపాల్ వర్మ లాంటి మహామహుల వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన అంజన్ కే కళ్యాణ్ తెరకెక్కించిన అత్తారిల్లు నాకు బాగా నచ్చి తీసుకోవడం జరిగింది.. చిన్న సినిమాలు కూడా పెద్ద విజయం సాధిస్తాయని మరోమారు రుజువు చెయ్యబోయే సినిమా ఇది.. మణిశర్మ గారు అద్బుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. కడుపుబ్బా నవ్వించే కామెడీ, భయపెట్టించే ధ్రిల్స్ ,వినసొంపైన రెండు మంచి పాటలతో పాటు ఎన్నో ఎంటర్టైన్మెంట్ అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. ఇటీవల విడుదలయిన టీజర్ కు విశేషమైన స్పందన వచ్చింది. విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం అన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







