బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- April 30, 2026
మనామా: బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణకు జాతీయస్థాయిలో క్యాంపెయిన్ ను ప్రారంభించారు. దోమల వ్యాప్తిపై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం జారీ చేసిన ఆదేశాల మేరకు పురపాలక వ్యవహారాలు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా క్యాంపెయిన్ ను ప్రారంభించాయి.
ఇందులో భాగంగా నిలిచి ఉన్న నీటిని తొలగించడం, కీటక నియంత్రణ ప్రచారాలను విస్తరించడం, దోమల సంతానోత్పత్తి ప్రదేశాలను నిర్మూలించడానికి తనిఖీలను పెంచడంపై దృష్టి సారిస్తున్నారు. అన్ని గవర్నరేట్లలో సమన్వయ ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రిత్వ శాఖలు ఒక ప్రకటనలో తెలిపాయి.
క్యాపిటల్ సిటీతోపాటు ముహర్రాక్, ఉత్తర మరియు దక్షిణ గవర్నరేట్లలోని పురపాలక బృందాలు.. కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు మురుగునీటి వ్యవస్థలను మరియు నీటి తొలగింపు కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.
ప్రజారోగ్యం మరియు భద్రతను కాపాడటంలో నివాసితులు సరైన వ్యర్థాల పారవేత పద్ధతులను పాటించాలని మరియు నిలిచి ఉన్న నీటి ప్రదేశాలను ప్రత్యేక హాట్లైన్ ద్వారా తెలియజేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







