బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- April 30, 2026
మనామా: బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణకు జాతీయస్థాయిలో క్యాంపెయిన్ ను ప్రారంభించారు. దోమల వ్యాప్తిపై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం జారీ చేసిన ఆదేశాల మేరకు పురపాలక వ్యవహారాలు మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా క్యాంపెయిన్ ను ప్రారంభించాయి.
ఇందులో భాగంగా నిలిచి ఉన్న నీటిని తొలగించడం, కీటక నియంత్రణ ప్రచారాలను విస్తరించడం, దోమల సంతానోత్పత్తి ప్రదేశాలను నిర్మూలించడానికి తనిఖీలను పెంచడంపై దృష్టి సారిస్తున్నారు. అన్ని గవర్నరేట్లలో సమన్వయ ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రిత్వ శాఖలు ఒక ప్రకటనలో తెలిపాయి.
క్యాపిటల్ సిటీతోపాటు ముహర్రాక్, ఉత్తర మరియు దక్షిణ గవర్నరేట్లలోని పురపాలక బృందాలు.. కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు మురుగునీటి వ్యవస్థలను మరియు నీటి తొలగింపు కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.
ప్రజారోగ్యం మరియు భద్రతను కాపాడటంలో నివాసితులు సరైన వ్యర్థాల పారవేత పద్ధతులను పాటించాలని మరియు నిలిచి ఉన్న నీటి ప్రదేశాలను ప్రత్యేక హాట్లైన్ ద్వారా తెలియజేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం









