హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- April 30, 2026
మస్కట్: శ్వాసకోశ వ్యాధులను ఎదుర్కోవడానికి అధిక-ఖచ్చితత్వ సేవలను విస్తరించే ప్రయత్నంలో భాగంగా రాయల్ హాస్పిటల్ ఇటీవల మెడికల్ థొరాకోస్కోపీ సేవను ప్రారంభించింది. ఇది ఒక అధునాతన నిర్ధారణ మరియు చికిత్సా విధానమని డాక్టర్లు తెలిపు.
రాయల్ హాస్పిటల్, శ్వాసకోశ వ్యాధుల విభాగాధిపతి మరియు సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ యాకూబ్ సలాం అల్ హధ్రమీ మాట్లాడుతూ.. ఈ కొత్త సేవ ప్రారంభంతో వారానికి 2 నుండి 4 కేసుల చొప్పున ఈ రకమైన ప్రక్రియను నిర్వహించడానికి మార్గం సుగమమవుతుందని తెలిపారు.
శస్త్రచికిత్స అవసరాన్ని తొలగించడంతోపాటు పేషంట్ ఆసుపత్రిలో ఉండే సమయాన్ని కేవలం కొన్ని గంటలకు తగ్గిస్తుందన్నారు. అతి తక్కువ మత్తుమందు (2-3 సెం.మీ. కోత) అవసరమయ్యే ఒక ఎండోస్కోపిక్ సేవగా ఈ ప్రక్రియ ఆవిర్భవించిందని ఆయన వివరించారు. దీనికి భిన్నంగా సర్జికల్ ఎండోస్కోపీలో రోగి పూర్తి మత్తులో ఆసుపత్రిలో చాలా రోజులు ఉండవలసి వస్తుందని పేర్కొన్నారు.
కారణం తెలియని ఊపిరితిత్తుల లేదా ప్లూరల్ వ్యాధుల నిర్ధారణ వంటి అత్యంత సాధారణ కేసులకు ఈ ప్రక్రియ ద్వారా ప్రయోజనం ఉంటుందని డాక్టర్ యాకూబ్ తెలిపారు. థొరాకోస్కోపీని ప్రవేశపెట్టడం అనేది ఒమన్ లో శ్వాసకోశ వ్యవస్థ రోగులకు అందించే సేవల స్థాయిలో ఒక మైలురాయిని నెలకొల్పిందని ఆయన చెప్పారు. ఈ వైద్య సాంకేతికత రాయల్ హాస్పిటల్ అధునాతన ప్రత్యేక సేవలకు కేంద్రంగా మారుతుందని డాక్టర్ యాకూబ్ అన్నారు. ఒమన్ సుల్తానేట్లో ఈ అధునాతన ప్రక్రియ (థొరాకోస్కోపీ)ను ప్రారంభించిన మొట్టమొదటి ప్రభుత్వ ఆసుపత్రి రాయల్ హాస్పిటల్ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం









