ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- May 01, 2026
అబూదాబి: ప్రస్తుత ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, లెబనాన్, ఇరాక్ దేశాలకు యూఏఈ పౌరుల ప్రయాణాలను నిషేధిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) ప్రకటించింది.
అలాగే ప్రస్తుతం ఈ మూడు దేశాల్లో ఉన్న యూఏఈ పౌరులు వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని మంత్రిత్వ శాఖ సూచించింది. విదేశాల్లో ఉన్న తమ పౌరుల భద్రత, సంక్షేమాన్ని కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని పౌరులను కోరింది. ఇరాన్, లెబనాన్, ఇరాక్లలో ఉన్న యూఏఈ పౌరులు అత్యవసర సహాయం కోసం +97180044444 నంబర్ ద్వారా మంత్రిత్వ శాఖను సంప్రదించాలని సూచించింది.
పౌరుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా భావిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









