ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- May 01, 2026
అబూదాబి: ప్రస్తుత ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, లెబనాన్, ఇరాక్ దేశాలకు యూఏఈ పౌరుల ప్రయాణాలను నిషేధిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) ప్రకటించింది.
అలాగే ప్రస్తుతం ఈ మూడు దేశాల్లో ఉన్న యూఏఈ పౌరులు వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని మంత్రిత్వ శాఖ సూచించింది. విదేశాల్లో ఉన్న తమ పౌరుల భద్రత, సంక్షేమాన్ని కాపాడడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని పౌరులను కోరింది. ఇరాన్, లెబనాన్, ఇరాక్లలో ఉన్న యూఏఈ పౌరులు అత్యవసర సహాయం కోసం +97180044444 నంబర్ ద్వారా మంత్రిత్వ శాఖను సంప్రదించాలని సూచించింది.
పౌరుల భద్రతను అత్యంత ప్రాధాన్యంగా భావిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







