డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- May 01, 2026
మచిలీపట్టణం: మచిలీపట్టణం నడిబొడ్డున స్థానిక జిల్లాకోర్టు సెంటరు నందు 2 ఎకరాల విస్తీర్ణంలో డా.భోగరాజు పట్టాభిసీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి కావలసిన ప్రభుత్వ అనుమతుల జారీకి నేడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయమై బందరు ఎంపీ బాలశౌరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకు మరియు ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కు మచిలీపట్టణం పార్లమెంట్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియచేసారు.
గతంలో మొదటి దశ నిర్మాణానికి కావలిసిన రూ.6.5 కోట్ల రూపాయలు గతంలోనే యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా వారు మంజూరు అయిన సంగతి విదితమే. అయితే ఈ నిర్మాణానికి అవసరమైన స్థలమునకు సంబంధిచి ప్రభుత్వం నుండి రావాల్సిన అనుమతులు రాకుండా గత ప్రభుత్వం అడ్డుకోవడంతో ఇంతకాలం జాప్యం ఏర్పడింది. నేడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో అనుమతులు కూడా మంజూరు కావడంతో త్వరలోనే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి బందరుకు తలమానికంగా దీని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఎంపీ వెల్లడించారు.
తాజా వార్తలు
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!







