డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- May 01, 2026
మచిలీపట్టణం: మచిలీపట్టణం నడిబొడ్డున స్థానిక జిల్లాకోర్టు సెంటరు నందు 2 ఎకరాల విస్తీర్ణంలో డా.భోగరాజు పట్టాభిసీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి కావలసిన ప్రభుత్వ అనుమతుల జారీకి నేడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయమై బందరు ఎంపీ బాలశౌరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకు మరియు ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కు మచిలీపట్టణం పార్లమెంట్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియచేసారు.
గతంలో మొదటి దశ నిర్మాణానికి కావలిసిన రూ.6.5 కోట్ల రూపాయలు గతంలోనే యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా వారు మంజూరు అయిన సంగతి విదితమే. అయితే ఈ నిర్మాణానికి అవసరమైన స్థలమునకు సంబంధిచి ప్రభుత్వం నుండి రావాల్సిన అనుమతులు రాకుండా గత ప్రభుత్వం అడ్డుకోవడంతో ఇంతకాలం జాప్యం ఏర్పడింది. నేడు జరిగిన క్యాబినెట్ సమావేశంలో అనుమతులు కూడా మంజూరు కావడంతో త్వరలోనే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి బందరుకు తలమానికంగా దీని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఎంపీ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







