లక్ష్మణ ఫలం తో క్యాన్సర్ నివారణ...
- August 06, 2016
క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. మనిషిని నిలువునా కుంగదీసే మహమ్మారి. క్యాన్సర్ సోకిందంటే ఖరీదయిన చికిత్స తప్పనిసరి. ఈ వ్యాధికి బలైపోయిన పేదలెందరో. రాచపుండు బారినపడి మృత్యువు కోసం వేచిచూడటం తప్ప చికిత్స చేయించుకునే స్థోమతలేని వారు ఎందరో ఉన్నారు. క్యాన్సర్ ను ఎదుర్కొనేందుకు రేడియేషన్ థెరపీ మినహా మరోమార్గంలేదు. అయితే తాజాగా ఓ మధుర ఫలం ఈ వ్యాధిని సమర్ధవంతంగా నిలువరించగలదని శాస్త్రవేత్తలంటున్నారు. సీతాఫల జాతికి చెందిన అన్నోనా మ్యూరికేటాపై జరిపిన ప్రాథమిక పరిశోధనల్లో తామీ విషయాన్ని కనుగొన్నామని చెప్తున్నారు.
అన్నోనా మ్యూరికేటా సాధారణ పేరు లక్ష్మణ ఫలం. క్యాన్సర్ నివారణలో ఈ పండు దివ్యౌషధం అని శాస్త్రవేత్తల విశ్వాసం. ఈ పండులో పుష్కలంగా ఉన్న అనినోషియన్ అసిటోజిన్ కు క్యాన్సర్ కణాలపై పోరాడే లక్షణం ఉందని వారంటున్నారు. అంతేకాక ఐరన్, కాపర్, మెగ్నీషియం వంటి మినరల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుందని అంటున్నారు. అన్నోనా మ్యూరికేటా క్యాన్సర్ రోగులకు సంజీవని లాంటిదని చెప్తున్నారు. ఈ ఫలంపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది. ఈ పండు క్యాన్సర్ ను నిరోధించగలదని తేలితే అందరికీ సంతోషమే.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









