‘మట్టన్’తో ప్యాన్ ఇండియా ఎంట్రీ…ఫస్ట్ లుక్ రేపు విడుదల!
- May 04, 2026
పుష్ప” చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారి, మరియు ఈ చిత్రంని యువ దర్శకుడు హర్షా డైస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డైస్ ఆర్ట్ ఫిలిమ్స్ బ్యానర్పై ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “మట్టన్” చిత్రం త్వరలో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ను రేపు అధికారికంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ముందుగానే బయటకు వచ్చిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “రక్తం.. రణం.. ప్రతీకారం..” అనే ట్యాగ్లైన్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రంలో జగదీష్ ప్రతాప్ బండారి పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఆయన కొత్త లుక్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండస్ట్రీలో మంచి బజ్ను క్రియేట్ చేస్తోంది.
టీమ్
మనస్వి, రాజేష్ కన్నా,రమేష్ మాదాసు, క్రాంతి సంజయ్, కిరీటి రాజ్ ముస్సి, రవివర్మ ఉప్పలపాటి, తనాయ్ దేవునూరి, శ్రీనాథ్, నాగదీపక్ తదితరులు.
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : డైస్ ఆర్ట్ ఫిలిమ్స్
నిర్మాత : దర్శకత్వం : హర్షా డైన్
పి ఆర్.ఓ : హరీష్ అప్పారా
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







