అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- May 04, 2026
మనామా: ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, ప్రాంతీయ పరిణామాలపై చర్చించేందుకు గల్ఫ్ సహకార మండలి (జిసిసి) సెక్రటరీ జనరల్ రియాద్లో యూరోపియన్ పార్లమెంట్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ మేరకు జిసిసి ఒక ప్రకటనలో తెలిపింది.
జిసిసి జనరల్ సెక్రటేరియట్లో యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు (MEP) రైన్హోల్డ్ లోపట్కా నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి జిసిసి సెక్రటరీ జనరల్ జాసిమ్ మహమ్మద్ అల్-బుడైవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరుపక్షాలు, రెండు కూటముల మధ్య సహకారాన్ని పెంపొందించే అవకాశాలను సమీక్షించాయి. పరస్పర ప్రయోజనాలకు దోహదపడే అభివృద్ధి, భద్రత మరియు స్థిరత్వానికి మద్దతునిచ్చే విధంగా గల్ఫ్-యూరోపియన్ సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు కొనసాగాయని జీసీసీ తెలిపింది.
ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భాగస్వాములతో సంబంధాలను మరింతగా పెంపొందించుకోవడానికి గల్ఫ్ దేశాలు ఆసక్తిగా ఉన్నాయని అల్-బుడైవి అన్నారు. ఈ పర్యటన జిసిసి మరియు యూరోపియన్ యూనియన్ మధ్య సహకార రంగాల అభివృద్ధికి సహాయపడుతుందని ఆయన తెలిపారు.
ఇటీవలి ప్రాంతీయ పరిణామాలపై కూడా ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. ఇటీవలి ఇరాన్ దాడుల నేపథ్యంలో జీసీసీ దేశాలకు తమ మద్దతును యూరోపియన్ పార్లమెంట్ ప్రతినిధి బృంద సభ్యులు పునరుద్ఘాటించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







