అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- May 04, 2026
మనామా: ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, ప్రాంతీయ పరిణామాలపై చర్చించేందుకు గల్ఫ్ సహకార మండలి (జిసిసి) సెక్రటరీ జనరల్ రియాద్లో యూరోపియన్ పార్లమెంట్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ మేరకు జిసిసి ఒక ప్రకటనలో తెలిపింది.
జిసిసి జనరల్ సెక్రటేరియట్లో యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు (MEP) రైన్హోల్డ్ లోపట్కా నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి జిసిసి సెక్రటరీ జనరల్ జాసిమ్ మహమ్మద్ అల్-బుడైవి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరుపక్షాలు, రెండు కూటముల మధ్య సహకారాన్ని పెంపొందించే అవకాశాలను సమీక్షించాయి. పరస్పర ప్రయోజనాలకు దోహదపడే అభివృద్ధి, భద్రత మరియు స్థిరత్వానికి మద్దతునిచ్చే విధంగా గల్ఫ్-యూరోపియన్ సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు కొనసాగాయని జీసీసీ తెలిపింది.
ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భాగస్వాములతో సంబంధాలను మరింతగా పెంపొందించుకోవడానికి గల్ఫ్ దేశాలు ఆసక్తిగా ఉన్నాయని అల్-బుడైవి అన్నారు. ఈ పర్యటన జిసిసి మరియు యూరోపియన్ యూనియన్ మధ్య సహకార రంగాల అభివృద్ధికి సహాయపడుతుందని ఆయన తెలిపారు.
ఇటీవలి ప్రాంతీయ పరిణామాలపై కూడా ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. ఇటీవలి ఇరాన్ దాడుల నేపథ్యంలో జీసీసీ దేశాలకు తమ మద్దతును యూరోపియన్ పార్లమెంట్ ప్రతినిధి బృంద సభ్యులు పునరుద్ఘాటించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సీబ్ విలాయత్లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!









