ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- May 04, 2026
ఫుజైరా: ఫుజైరాలోని ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ (FOIZ)లో భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఇరాన్ వైపు నుంచి జరిగిన డ్రోన్ దాడి కారణంగా చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.
డ్రోన్ దాడి అనంతరం పరిశ్రమ ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు నిర్ధారించిన అధికారులు, వెంటనే ఫుజైరా సివిల్ డిఫెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే చర్యలు ప్రారంభించాయని తెలిపారు. అగ్నిప్రమాదాన్ని నియంత్రించేందుకు రక్షణ బృందాలు నిరంతరంగా శ్రమిస్తున్నాయి.
ఈ ఘటనలో ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఇతర నష్టాల పై పూర్తి వివరాలు వెలువడలేదని అధికారులు పేర్కొన్నారు. పరిస్థితిని నియంత్రణలోకి తీసుకురావడానికి అత్యవసర చర్యలు కొనసాగుతున్నాయి.
అలాగే, ప్రజలు అపోహలు, వదంతులను నమ్మకుండా కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని అధికారులు సూచించారు. పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







