యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- May 04, 2026
అబుదాబి: యూఏఈ ఉన్నత విద్య మరియు శాస్త్రీయ పరిశోధన మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ (దూర విద్య) విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నిర్ణయం 2026 మే 5వ తేదీ (మంగళవారం) నుంచి మే 8వ తేదీ (శుక్రవారం) వరకు అమల్లో ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
విద్యా ప్రక్రియను సమర్థవంతంగా, సౌలభ్యంగా కొనసాగించడమే ఈ చర్య యొక్క ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా విద్యా వ్యవస్థను సజావుగా కొనసాగించేందుకు ఈ నియంత్రణ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అయితే, క్లినికల్ ట్రైనింగ్, ప్రయోగశాల (ల్యాబ్) కార్యకలాపాలు, ప్రత్యక్ష ప్రాక్టికల్ లేదా ఫీల్డ్ ఆధారిత శిక్షణ, అలాగే ప్రత్యక్ష పరీక్షలు అవసరమైన ప్రాధాన్య అకడమిక్ కార్యక్రమాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. అలాంటి కోర్సులు మంత్రిత్వ శాఖ నిర్ణయించిన మేరకు ప్రత్యక్ష బోధన (ఫేస్-టు-ఫేస్) విధానంలో కొనసాగుతాయని స్పష్టం చేసింది.
విద్యార్థుల అకడమిక్ పురోగతికి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







