ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్
- May 05, 2026
న్యూ ఢిల్లీ: ఫుజైరా పోర్ట్ ఆయిల్ ఇండస్ట్రీ జోన్ పై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు గాయపడటాన్ని భారత్ మంగళవారం ‘ఆమోదయోగ్యం కానిది’గా అభివర్ణించింది. అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఘర్షణలను తక్షణమే విరమించుకోవాలని కూడా అది కోరింది. ఫుజైరాలోని ఒక ప్రధాన చమురు పరిశ్రమ ప్రాంతంలో డ్రోన్ దాడి కారణంగా మంటలు చెలరేగి, భారతీయులు గాయపడిన ఒక రోజు తర్వాత న్యూఢిల్లీ ఈ విధంగా స్పందించింది. ఈ దాడిని ఇరాన్ చేసిందని యూఏఈ ఆరోపించింది.
“ఫుజైరా పై జరిగిన దాడిలో ముగ్గురు భారత పౌరులు గాయపడటం ఆమోదయోగ్యం కాదు,” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. “ఈ ఘర్షణలను, పౌర మౌలిక సదుపాయాలను, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని తక్షణమే నిలిపివేయాలని మేము పిలుపునిస్తున్నాము,” అని ప్రతినిధి తెలిపారు. పశ్చిమ ఆసియా అంతటా శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించేందుకు ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి చర్చలు, దౌత్యం కోసమే భారతదేశం నిలబడుతుందని జైస్వాల్ అన్నారు. “అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా హోర్ముజ్ జలసంధి గుండా స్వేచ్ఛాయుత, నిరాటంకమైన నౌకాయానం, వాణిజ్యం జరగాలని కూడా మేము పిలుపునిస్తున్నాము అని జైస్వాల్ అన్నారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







