విజయ్ కీలక నిర్ణయం..
- May 05, 2026
చెన్నై: తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రభజనం సృష్టించింది. 108 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేలు అవసరం. దీంతో టీవీకేకు మరో 10మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ ఏఏ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.
తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. దీంతో ఇవాళ విజయ్ గవర్నర్ను కలిసే అవకాశం ఉంది.ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ను విజయ్ కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు టీవీకే పార్టీ ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశం అయ్యారు. ఏఏ పార్టీలను కలుపుకొని వెళ్లాలనే అంశం పై చర్చించారు. ఈ క్రమంలో డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీలతో కలవకూడదని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ (5), పీఎంకే(4), విసికే(2), సీపీఎం(2), సిపిఐ(2), డిఎండికే (1) పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో విజయ్ ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వం ఏర్పాటు కోసం కాంగ్రెస్తో కలవడం దాదాపు ఖాయమైనట్లు టీవీకే పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే విజయ్ కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా పొత్తుల విషయం పైనా ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. టీవీకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని విజయ్ తో రాహుల్ చెప్పినట్లు సమాచారం.
టీవీకేతో పొత్తుపట్ల కాంగ్రెస్ పార్టీ పూర్తి సానుకూలతగా ఉండటంతోపాటు.. పీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐ, డీఎండీకే పార్టీలు కూడా సుమఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే విజయ్ వారితో సంప్రదింపులు జరుపుతున్నారని, బుధవారం ఉదయం నాటికి పొత్తులపై ఓ క్లారిటీ వస్తుందని, ఆ తరువాత ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు ప్రారంభం అవుతాయని టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







