హోర్ముజ్ జలసంధిని 'బేరసారాల సాధనంగా' చేయొద్దు: ఖతార్
- May 05, 2026
దోహా: హోర్ముజ్ జలసంధిని "బేరసారాల సాధనంగా(Bargaining Chip)" ఉపయోగించడాన్ని ఖతార్ తిరస్కరిస్తోందని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఈ కీలక నౌకా మార్గాన్ని షరతులు లేకుండా తెరిచి ఉంచాలని కోరింది. జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ అనేది రాజీపడలేని అంశమని స్పష్టం చేసింది. దీనికి ఎలాంటి అంతరాయం కలిగినా అది ప్రాంతీయ దేశాల కీలక ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తుందని హెచ్చరించింది.
పొరుగు దేశాల ఆస్తులపై జరుగుతున్న అన్యాయమైన దాడులను ఆపాలని ఖతార్ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు పూర్తి సంఘీభావం వ్యక్తం చేయడంతో పాటు తన ఆస్తులను కాపాడుకోవడానికి యూఏఈ తీసుకుంటున్న అన్ని చర్యలకు మద్దతు తెలిపింది.
ఒమన్ గల్ఫ్ మరియు అరేబియా గల్ఫ్ మధ్య ఉన్న ఇరుకైన సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధి.. ప్రపంచ చమురు రవాణాకు ఒక కీలకమైన మార్గంగా ఉంది. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20 శాతం ఈ మార్గం నుంచే సరఫరా అవుతోంది.
అలాగే, హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ADNOC అనుబంధ ఎమిరేట్స్ చమురు ట్యాంకర్పై ఇరాన్ జరిపిన దాడిని ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టం మరియు సముద్రయాన నిబంధనల ఉల్లంఘన అని పేర్కొంది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







