హోర్ముజ్ జలసంధిని "బేరసారాల సాధనంగా" చేయొద్దు: ఖతార్
- May 05, 2026
దోహా: హోర్ముజ్ జలసంధిని "బేరసారాల సాధనంగా(Bargaining Chip)" ఉపయోగించడాన్ని ఖతార్ తిరస్కరిస్తోందని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఈ కీలక నౌకా మార్గాన్ని షరతులు లేకుండా తెరిచి ఉంచాలని కోరింది. జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛ అనేది రాజీపడలేని అంశమని స్పష్టం చేసింది. దీనికి ఎలాంటి అంతరాయం కలిగినా అది ప్రాంతీయ దేశాల కీలక ప్రయోజనాలకు ముప్పు కలిగిస్తుందని హెచ్చరించింది.
పొరుగు దేశాల ఆస్తులపై జరుగుతున్న అన్యాయమైన దాడులను ఆపాలని ఖతార్ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు పూర్తి సంఘీభావం వ్యక్తం చేయడంతో పాటు తన ఆస్తులను కాపాడుకోవడానికి యూఏఈ తీసుకుంటున్న అన్ని చర్యలకు మద్దతు తెలిపింది.
ఒమన్ గల్ఫ్ మరియు అరేబియా గల్ఫ్ మధ్య ఉన్న ఇరుకైన సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధి.. ప్రపంచ చమురు రవాణాకు ఒక కీలకమైన మార్గంగా ఉంది. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20 శాతం ఈ మార్గం నుంచే సరఫరా అవుతోంది.
అలాగే, హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ADNOC అనుబంధ ఎమిరేట్స్ చమురు ట్యాంకర్పై ఇరాన్ జరిపిన దాడిని ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టం మరియు సముద్రయాన నిబంధనల ఉల్లంఘన అని పేర్కొంది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్.. అబుదాబి, దుబాయ్, ఫుజైరా కనెక్ట్..ఫుల్ డిటైల్స్..!!
- బుఖా ఘటనలో ఇద్దరు విదేశీయులకు గాయాలు, వాహనాలకు నష్టం..!!
- హోర్ముజ్ జలసంధిని "బేరసారాల సాధనంగా" చేయొద్దు: ఖతార్
- బహ్రెయిన్ లో డ్రైవర్కు 7 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా యూఏఈకి సౌదీ మద్దతు..!!
- జహ్రా వైపు వెళ్లే ఐదవ రింగ్ రోడ్ ఈనెల 16 వరకు పాక్షికంగా మూసివేత..!!
- భారతీయుల పై దాడి.. ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం!
- విజయ్ పార్టీ (టీవీకే) TVK గెలుపు వెనుక కపిల్ సాహూ
- రుణ మాఫీ మోసాల పై RBI కీలక హెచ్చరిక!
- తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాల కోసం E2E కార్యక్రమం ప్రారంభం









