ఎతిహాద్ రైల్.. అబుదాబి, దుబాయ్, ఫుజైరా కనెక్ట్..ఫుల్ డిటైల్స్..!!

- May 05, 2026 , by Maagulf
ఎతిహాద్ రైల్.. అబుదాబి, దుబాయ్, ఫుజైరా కనెక్ట్..ఫుల్ డిటైల్స్..!!

యూఏఈ: అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Etihad Rail ప్రయాణీకుల సేవలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే దశలవారీగా ప్రారంభమవుతాయని ఒక సీనియర్ అధికారి తెలిపారు.  ప్రణాళిక ప్రకారం 2026లో ఇవి పట్టాలెక్కుతాయని ఒక సీనియర్ అధికారి ప్రకటనలో ధృవీకరించారు. ఎతిహాద్ రైల్  లో పబ్లిక్ పాలసీ విభాగం డైరెక్టర్ అద్రా అల్ మౌసౌరి మాట్లాడుతూ, ప్రయాణీకుల రవాణా కార్యకలాపాలు క్రమబద్ధంగా మరియు క్షుణ్ణమైన పరిశోధన ఆధారంగా రూపొందించిన దశల్లో నిర్వహించబడతాయని తెలిపారు.

తన మొదటి నిర్వహణ దశలో ఎతిహాద్ రైల్ అబుదాబి మరియు దుబాయ్‌లను అనుసంధానిస్తుందని, తూర్పు తీరంలో ఉన్న ఫుజైరా వరకు ఈ మార్గం విస్తరిస్తుందని పేర్కొన్నారు. జనాభా, డిమాండ్ మరియు ఎమిరేట్ల మధ్య అనుసంధాన ప్రాధాన్యతలతో సహా వివిధ ప్రమాణాల ఆధారంగా ఈ ప్రారంభ మార్గాలను నిర్ణయించినట్లు వివరించారు. పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత 2030 నాటికి ఈ సేవ ద్వారా ఏటా సుమారు 36.5 మిలియన్ల (3 కోట్ల 65 లక్షల) మంది ప్రయాణీకులకు రవాణా సౌకర్యం కలుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఎతిహాద్ రైల్ కు సంబంధించిన 11 స్టేషన్లను ప్రకటించారు. అవి:

అల్ సిలా (Al Sila)

అల్ దన్హా (Al Dhannah)

అల్ మిర్ఫా (Al Mirfa)

మదానథ్ జాయెద్ (Madinat Zayed)

మెజైరా (Mezairaa)

అల్ ఫయా (Al Faya)

మహమ్మద్ బిన్ జాయెద్ సిటీ (Mohammed Bin Zayed City)

జుమైరా గోల్ఫ్ ఎస్టేట్స్ ( Jumeirah Golf Estates)

యూనివర్సిటీ సిటీ (University City (Sharjah))

సాకమ్కామ్ (Sakamkam (Fujairah))

అల్ దైయిద్ (Al Dhaid)

జనాభా కేంద్రాలకు సేవలు అందించే ఉద్దేశంతో, కీలకమైన ప్రదేశాలలో స్టేషన్ల ప్రాంతాలను ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసినట్లు ఎతిహాద్ రైల్ ప్రాజెక్టుల ముఖ్య అధికారి మహమ్మద్ అల్షెహీ  తెలిపారు.

ఇటీవల దుబాయ్ మెట్రో 'Gold Line' ప్రకటన సందర్భంగా విడుదల చేసిన మ్యాప్‌లో, Al Meydan వద్ద భవిష్యత్తులో ఒక స్టేషన్ వచ్చే అవకాశం ఉందని సూచించారు.  ఇక్కడ మెట్రో జంక్షన్ రానుంది. ఈ స్టేషన్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. దీనికి అదనంగా, మెట్రో రెడ్ లైన్ మరియు రాబోయే 'Gold Line' మార్గాలు జుమైర్హా గోల్ఫ్ ఎస్టేట్ (Jumeirah Golf Estate) వద్ద ఎతిహాద్ రైల్ మార్గాలు క్రాస్ అవుతాయని ప్రకటించారు.

13 రైళ్లు, ఒక్కో రైలులో 400 మంది ప్రయాణీకులు

2026లో ప్రారంభమయ్యే మొదటి దశ నుండే రైల్వే నెట్‌వర్క్‌ల నిర్వహణలో ఉన్నతమైన ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అత్యున్నత స్థాయి భద్రత, విశ్వసనీయత మరియు సామర్థ్యాన్ని ఈ రైలు సేవలు కల్పిస్తాయని తెలిపారు. గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రయాణీకుల రైలు సర్వీసును నిర్వహించడానికి ఎతిహాద్ రైల్.. ప్రపంచ ప్రయాణీకుల రవాణా సంస్థ అయిన కియోలిస్‌తో ఒక చారిత్రాత్మక జాయింట్ వెంచర్‌పై సంతకం చేసింది.    

రైలు లోపలి భాగాలలో ఆధునిక డిజైన్, పూర్తి వై-ఫై కనెక్టివిటీ మరియు ప్రతి సీటు వద్ద వ్యక్తిగత పవర్ అవుట్‌లెట్‌లు ఉంటాయి. నగరాల మధ్య వేగవంతమైన మరియు సమర్థవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. ఇప్పటికే 13 రైళ్లలో పది యూఏఈకి చేరుకున్నాయి.  అత్యున్నత అంతర్జాతీయ భద్రత మరియు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వాటిని అధికారులు పరిక్షించారు. ప్రతి రైలులో 400 మంది ప్రయాణీకుల వరకు ప్రయాణించవచ్చని వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com