యూఏఈ పై మళ్లీ ఇరాన్ క్షిపణి దాడుల ముప్పు.. గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తం
- May 05, 2026
దుబాయ్: యూఏఈ పై ఇరాన్ నుంచి మరోసారి క్షిపణి మరియు డ్రోన్ దాడుల ముప్పు నెలకొనడంతో దేశవ్యాప్తంగా అత్యవసర హెచ్చరిక వ్యవస్థలు మళ్లీ సక్రియమయ్యాయి. యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలోని పలు ప్రాంతాల్లో వినిపించిన భారీ శబ్దాలు గగనతల రక్షణ వ్యవస్థలు బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైళ్లు మరియు డ్రోన్లను అడ్డుకోవడంలో భాగంగా ఉత్పన్నమైనవని వెల్లడించింది.
ఇరాన్ నుంచి వచ్చిన తాజా దాడులను యూఏఈ గగనతల రక్షణ దళాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయని అధికారులు తెలిపారు. మే 4న ఇరాన్ 12 బాలిస్టిక్ క్షిపణులు, మూడు క్రూయిజ్ మిసైళ్లు, నాలుగు డ్రోన్లను ప్రయోగించిందని సమాచారం. ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీస్ జోన్పై జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు భారతీయులు గాయపడగా, అద్నాక్కు చెందిన ఓ ట్యాంకర్ హోర్ముజ్ జలసంధిలో దెబ్బతిన్నట్లు వెల్లడైంది.
ఇరాన్ చర్యలను యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు డాక్టర్ అన్వర్ గర్గాష్ తీవ్రంగా ఖండిస్తూ, “ఇరాన్ దాడి ధోరణి గల దేశం, ఇది అరేబియా గల్ఫ్ భద్రతకు ముప్పు” అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు, బెదిరింపులు ఆపకపోతే ఇరాన్పై ఆంక్షలు విధించడంతో పాటు అవసరమైతే బల ప్రయోగానికి అనుమతి ఇవ్వగల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానంపై అమెరికా, బహ్రెయిన్ మద్దతుతో చర్చలు ప్రారంభమయ్యాయి.
అదే సమయంలో, తెహ్రాన్ పశ్చిమ ప్రాంతంలోని ఓ షాపింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇరానియన్ మీడియా విడుదల చేసిన వీడియోల్లో భారీగా పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి.
తాజా వార్తలు
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత
- యూఏఈ పై మళ్లీ ఇరాన్ క్షిపణి దాడుల ముప్పు.. గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తం
- ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్
- రాష్ట్రానికి తరగని ఆస్తిగా ఇనుప ఖనిజం నిల్వలు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ సమీపంలో అమెరికా సైనిక విమానం అదృశ్యం..
- ఎతిహాద్ రైల్.. అబుదాబి, దుబాయ్, ఫుజైరా కనెక్ట్..ఫుల్ డిటైల్స్..!!
- బుఖా ఘటనలో ఇద్దరు విదేశీయులకు గాయాలు, వాహనాలకు నష్టం..!!
- హోర్ముజ్ జలసంధిని "బేరసారాల సాధనంగా" చేయొద్దు: ఖతార్









