యాత్రికుల మానసిక ఆరోగ్యం కోసం బుక్ విడుదల..!!
- May 06, 2026
దోహా: ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH), దేవాదాయ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో "యాత్ర: ఒక సైకలాజికల్ మరియు బిహేవియరల్ స్కూల్" అనే పేరుతో ఒక పుస్తకాన్ని విడుదల చేసింది.
ఈ అవగాహన పుస్తకం యాత్రికుల మానసిక మరియు ప్రవర్తనా ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హజ్ యాత్రకు సన్నాహాల్లో భాగంగా మరియు యాత్రికుల ఆరోగ్యం, భద్రతను మెరుగుపరిచే క్రమంలో దీనిని విడుదల చేసినట్లు తెలిపారు.
యాత్రలో భాగంగా మతాచారాలు నిర్వహిస్తున్నప్పుడు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి యాత్రికులలో అవగాహన పెంచడం, సహనం, వినయం మరియు ఆత్మనిగ్రహం వంటి విలువలను పెంపొందించడం దీని లక్ష్యమని చెప్పారు.
అలాగే, తప్పనిసరి అయిన హజ్ యాత్రను చేపట్టే ముందు మానసికంగా సిద్ధమయ్యే ప్రాముఖ్యతను ఈ పుస్తకం తెలియజేస్తుందన్నారు. యాత్ర సమయంలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటానికి, ముఖ్యంగా ముందస్తు ప్రణాళిక వేసుకోవడం, ప్రాథమిక అవసరాలను ఏర్పాటు చేసుకోవడం మరియు అవసరమైన సామాగ్రి జాబితాను సిద్ధం చేసుకోవడం వంటి ఆచరణాత్మక మార్గదర్శకాలను ఈ బుక్ వివరిస్తుందని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
అత్యవసర పరిస్థితులలో ప్రశాంతంగా ఉండటం, ఆచారాలు నిర్వహిస్తున్నప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, రద్దీగా ఉన్నప్పుడు లేదా అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు యాత్రికులు తగిన ప్రదేశాలలో ఉండేలా చూసుకోవడం వంటి విషయాలపై ఈ పుస్తకం సలహా ఇస్తుందని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







