యాత్రికుల మానసిక ఆరోగ్యం కోసం బుక్ విడుదల..!!
- May 06, 2026
దోహా: ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH), దేవాదాయ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో "యాత్ర: ఒక సైకలాజికల్ మరియు బిహేవియరల్ స్కూల్" అనే పేరుతో ఒక పుస్తకాన్ని విడుదల చేసింది.
ఈ అవగాహన పుస్తకం యాత్రికుల మానసిక మరియు ప్రవర్తనా ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హజ్ యాత్రకు సన్నాహాల్లో భాగంగా మరియు యాత్రికుల ఆరోగ్యం, భద్రతను మెరుగుపరిచే క్రమంలో దీనిని విడుదల చేసినట్లు తెలిపారు.
యాత్రలో భాగంగా మతాచారాలు నిర్వహిస్తున్నప్పుడు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి యాత్రికులలో అవగాహన పెంచడం, సహనం, వినయం మరియు ఆత్మనిగ్రహం వంటి విలువలను పెంపొందించడం దీని లక్ష్యమని చెప్పారు.
అలాగే, తప్పనిసరి అయిన హజ్ యాత్రను చేపట్టే ముందు మానసికంగా సిద్ధమయ్యే ప్రాముఖ్యతను ఈ పుస్తకం తెలియజేస్తుందన్నారు. యాత్ర సమయంలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటానికి, ముఖ్యంగా ముందస్తు ప్రణాళిక వేసుకోవడం, ప్రాథమిక అవసరాలను ఏర్పాటు చేసుకోవడం మరియు అవసరమైన సామాగ్రి జాబితాను సిద్ధం చేసుకోవడం వంటి ఆచరణాత్మక మార్గదర్శకాలను ఈ బుక్ వివరిస్తుందని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
అత్యవసర పరిస్థితులలో ప్రశాంతంగా ఉండటం, ఆచారాలు నిర్వహిస్తున్నప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, రద్దీగా ఉన్నప్పుడు లేదా అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు యాత్రికులు తగిన ప్రదేశాలలో ఉండేలా చూసుకోవడం వంటి విషయాలపై ఈ పుస్తకం సలహా ఇస్తుందని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









