యాత్రికుల మానసిక ఆరోగ్యం కోసం బుక్ విడుదల..!!
- May 06, 2026
దోహా: ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH), దేవాదాయ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో "యాత్ర: ఒక సైకలాజికల్ మరియు బిహేవియరల్ స్కూల్" అనే పేరుతో ఒక పుస్తకాన్ని విడుదల చేసింది.
ఈ అవగాహన పుస్తకం యాత్రికుల మానసిక మరియు ప్రవర్తనా ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హజ్ యాత్రకు సన్నాహాల్లో భాగంగా మరియు యాత్రికుల ఆరోగ్యం, భద్రతను మెరుగుపరిచే క్రమంలో దీనిని విడుదల చేసినట్లు తెలిపారు.
యాత్రలో భాగంగా మతాచారాలు నిర్వహిస్తున్నప్పుడు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి యాత్రికులలో అవగాహన పెంచడం, సహనం, వినయం మరియు ఆత్మనిగ్రహం వంటి విలువలను పెంపొందించడం దీని లక్ష్యమని చెప్పారు.
అలాగే, తప్పనిసరి అయిన హజ్ యాత్రను చేపట్టే ముందు మానసికంగా సిద్ధమయ్యే ప్రాముఖ్యతను ఈ పుస్తకం తెలియజేస్తుందన్నారు. యాత్ర సమయంలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటానికి, ముఖ్యంగా ముందస్తు ప్రణాళిక వేసుకోవడం, ప్రాథమిక అవసరాలను ఏర్పాటు చేసుకోవడం మరియు అవసరమైన సామాగ్రి జాబితాను సిద్ధం చేసుకోవడం వంటి ఆచరణాత్మక మార్గదర్శకాలను ఈ బుక్ వివరిస్తుందని మంత్రిత్వశాఖ వెల్లడించింది.
అత్యవసర పరిస్థితులలో ప్రశాంతంగా ఉండటం, ఆచారాలు నిర్వహిస్తున్నప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, రద్దీగా ఉన్నప్పుడు లేదా అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు యాత్రికులు తగిన ప్రదేశాలలో ఉండేలా చూసుకోవడం వంటి విషయాలపై ఈ పుస్తకం సలహా ఇస్తుందని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







