వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- May 07, 2026
అంకారాః దౌత్య మరియు ప్రత్యేక పాస్పోర్ట్ కలిగిన వారికి వీసా నిబంధనల నుండి పరస్పర మినహాయింపు కల్పించేందుకు సౌదీ అరేబియా మరియు టర్కీయే అంగీకరించాయి. టర్కీ రాజధాని అంకారాలో జరిగిన సమావేశంలో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మరియు టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు.ఈ సమావేశంలో ఇరు దేశాలకు చెందిన మంత్రులు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. అలాగే, తాజా ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. మిడిలీస్టులో భద్రత, స్థిరత్వాన్ని కాపాడే మార్గాలపై చర్చించినట్లు అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలియజేశాయి.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







