సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- May 07, 2026
కోల్ కత్తా: సువెందు అధికారి వ్యక్తిగత సహాయకుడు(PA), బీజేపీ నాయకుడు చంద్రనాథ్ రథ్ను దుండగులు కాల్చిచంపిన ఘటన కోల్ కత్తా రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ ఘటన బుధవారం రాత్రి మద్యంగ్రామంలో చోటుచేసుకుంది. రథ్ ప్రయాణిస్తున్న వాహనాన్ని వెంబడించిన దుండగులు కాల్పులు జరిపారు.కారు ముందు సీటులో ఉన్న రథ్ను అత్యంత సమీపం నుంచి లక్ష్యంగా చేసుకుని కాల్చినట్లు తెలుస్తోంది. మొత్తం 10 రౌండ్లు కాల్పులు జరిపారని సమాచారం.తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు నిలవలేదు.వాహనంలో ఉన్న డ్రైవర్తో పాటు మరో వ్యక్తి గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ దాడి వెనుక టిఎంసి అనుచరుల హస్తం ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే సువెందు అధికారి తో పాటు పలువురు బీజేపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సువెందు తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న రోజుల నుంచే చంద్రనాథ్ రథ్ ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పరాజయం, బీజేపీ అధికారంలోకి రావడం తర్వాత రాష్ట్రంలో రాజకీయ హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ-తృణమూల్ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, తాజా హత్య రాష్ట్ర రాజకీయ పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







