ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!

- May 07, 2026 , by Maagulf
ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!

మనామా: బహ్రెయిన్ లో ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన పలికారు. వీరి తొలగింపునకు సంబంధించి 37 మంది ఎంపీలు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, శాసన మరియు న్యాయ వ్యవహారాల కమిటీ మద్దతు తెలిపిన నేపథ్యంలో ఎంపీలు అబ్దుల్నబీ సల్మాన్, మమ్దూహ్ అల్ సలేహ్ మరియు మహ్దీ అల్ షువైఖ్‌లకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఏకగ్రీవంగా ఓటు వేయడంతో వారిని తొలగించారు.

న్యాయాధికార చట్టంలోని ఆర్టికల్ 7ను సవరించే 2024 నాటి డిక్రీ-లా నెం. 13పై 2026 ఏప్రిల్ 28న పార్లమెంట్‌లో జరిగిన చర్చ సందర్భంగా ఈ ముగ్గురు ఎంపీల వైఖరి కారణంగా ఈ వివాదం తలెత్తింది. బహ్రెయిన్‌పై ఇరాన్ దాడులను సదరు ఎంపీలు ప్రశంసించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com