90వేల మంది లబ్ధిదారులకు ప్లాట్ లేదా రెసిడెన్షియల్ యూనిట్స్..!!
- May 08, 2026
మస్కట్: ఒమన్ గృహనిర్మాణ మరియు పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖ గత ఐదేళ్లలో సాధించిన గణంకాలను తెలియజేసింది. ఒమన్ సుల్తానేట్ వేగవంతమైన పట్టణ మరియు అభివృద్ధి సంబంధిత పరివర్తనలకు సాక్ష్యంగా నిలిచిందని తెలిపింది.
2020 నుండి 2025 మధ్య కాలంలో 8,000 కంటే ఎక్కువ కుటుంబాలు సొంత ఇళ్లను పొందాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో సామాజిక గృహనిర్మాణ కార్యక్రమాల కింద 200 మిలియన్ రియాల్స్ (RO) ఖర్చు చేసినట్లు పేర్కొంది. గత సంవత్సరంలోనే 2,794 కుటుంబాలు ఈ నిధుల ద్వారా లబ్ధి పొందాయన్నారు.
అలాగే, గృహనిర్మాణ సహాయం పొందిన కేసుల సంఖ్య 2020లో 1,260 నుండి 2025 నాటికి 1,782కి పెరిగిందన్నారు. 2021 నుండి 2025 మధ్య కాలంలో 90వేల కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు స్థలాలను లేదా నివాసాల యూనిట్లను పొందాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, 2025 సంవత్సరంలోనే 15,434 కుటుంబాలు వివిధ గృహనిర్మాణ ఎంపికల ద్వారా లబ్ధి పొందాయన్నారు.
2020తో పోలిస్తే 2024 మరియు 2025 సంవత్సరాల మధ్య స్థిరాస్తి రంగంలో వాణిజ్య విలువ RO 3.3 బిలియన్లకు పెరిగి, 37.5 శాతం సంచిత వృద్ధిని సాధించిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. స్థిరాస్తి వాణిజ్యంలో వార్షిక వృద్ధి రేటు 6.6 శాతానికి చేరుకోగా, 2024 మరియు 2025 మధ్య ఒమన్ సుల్తానేట్లో గల్ఫ్ స్థిరాస్తి పెట్టుబడి 95.3 శాతం వృద్ధిని నమోదు చేసింది మరియు విదేశీ పెట్టుబడి 39.4 శాతం పెరిగిందని వివరించారు.
ఒమన్ సుల్తానేట్ జీవన నాణ్యతను పెంచడానికి జాతీయ కార్యక్రమాల్లో ఒకటైన "లైవ్ ఒమన్" లక్ష్యం గురించి కూడా ప్రస్తావించారు. భద్రత, స్థిరత్వం, సేవల నాణ్యత ఆధారంగా పౌరులు, నివాసితులు మరియు సందర్శకులకు సమగ్ర జీవన వాతావరణాన్ని అందించడం ద్వారా ఇది సాధించబడుతుందని పేర్కొంది. ఈ విధానం కారణంగా 2025 సంవత్సరానికి గాను జీవన నాణ్యత సూచికలో ప్రపంచవ్యాప్తంగా ఒమన్ నాల్గవ స్థానాన్ని సాధించినట్లు వివరించారు.
ఈ కార్యక్రమాల్లో గృహ మరియు పట్టణ ప్రణాళిక శాఖ మంత్రి డాక్టర్ ఖల్ఫాన్ సయీద్ అల్ షుయైలీ, గృహ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ ఇంజనీర్ హమద్ అలీ అల్ నజ్వానీ, పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ మహమ్మద్ అలీ అల్ ముతావా తో పాటు పలువురు మంత్రిత్వ శాఖ అధికారులు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!







