దుబాయ్లో సింగిల్ మమ్ ని వరించిన అధృష్టం..!!
- May 08, 2026
యూఏఈ: దుబాయ్లో నివసిస్తున్న చైతన్య కుమారి రామచంద్రన్ 1 మిలియన్ దిర్హమ్ల బిగ్ టికెట్ బహుమతి గెలుచుకున్నారు. ఈ డబ్బను విలాసవంతమైన షాపింగ్ లేదా ఆడంబరమైన వేడుకల కోసం ఖర్చు పెట్టబోనని, ఎక్కువ భాగం తన కూతురు విదేశాల్లో న్యాయశాస్త్రం చదవాలనే కల కోసం వెచ్చించనున్నట్టు ఈ సింగిల్ మామ్ తెలిపారు.
తన కూతురు 10వ తరగతి పూర్తి చేసి, ఇప్పుడు 11వ తరగతిలో ఉందని, ఆమె యూకే లేదా ఆస్ట్రేలియాలో ఎక్కడైనా న్యాయశాస్త్రం చదవాలనుకుంటోందని తెలిపారు. అందుకే తాను ఈ డబ్బును ఆమె చదువు కోసం ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నట్టు చైతన్య చెప్పారు.
14 ఏళ్లుగా యూఏఈలో నివసిస్తున్న ఆమె, దుబాయ్లో కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. తాను ప్రస్తుతం భారత్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. తొలుత తన స్నేహితులు విషయం చెప్పగానే స్పామ్ అనుకున్నట్లు తెలిపారు. బిగ్ టికెట్ వెబ్సైట్ లో చూసి నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొన్నారు. తాను 1 మిలియన్ దిర్హమ్లు గెలుస్తానని ఎప్పుడూ ఊహించలేదన్నారు. తాను బిగ్ టికెట్ కొనడం ప్రారంభించిన ఆరవసారే విజేతగా నిలిచినట్లు చైతన్య తెలిపింది. ఇంతకుముందు ఆఫీసు సహోద్యోగులతో కలిసి టిక్కెట్లు కొన్నట్లు వివరించారు.
సింగిల్ మామ్ గా తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. విలాసాల కంటే స్థిరత్వానికే ఎక్కువ విలువ ఇవ్వడం నేర్చుకున్నానని చైతన్య చెప్పింది. భవిష్యత్తులో కూడా బిగ్ టికెట్తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కొనసాగిస్తానని ఆమె తెలిపింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







