యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- May 08, 2026
అబుదాబి: యూఏఈలో రాబోయే రోజుల్లో విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన కొనసాగించాలా లేదా దూర విద్య (రిమోట్ లెర్నింగ్) అమలు చేయాలా అనే విషయం పై మే 10 సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
ప్రస్తుత పరిస్థితులను సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించిన అనంతరం విద్యా విధానం పై నిర్ణయం తీసుకుంటామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యాసంస్థల సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని విద్యా ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
అలాగే, ఇప్పటికే ఆమోదించబడిన ప్రణాళికల ప్రకారం పరీక్షలు మరియు అంతర్జాతీయ అంచనా పరీక్షలు ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించబడతాయని స్పష్టం చేసింది.
అవసరమైన పరిస్థితుల్లో విద్యాసంస్థలు ప్రత్యక్ష బోధన నుంచి రిమోట్ లెర్నింగ్కు లేదా ఇతర బోధన విధానాలకు వేగంగా మారేలా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని విద్యాశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







