యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- May 08, 2026
అబుదాబి: యూఏఈలో రాబోయే రోజుల్లో విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన కొనసాగించాలా లేదా దూర విద్య (రిమోట్ లెర్నింగ్) అమలు చేయాలా అనే విషయం పై మే 10 సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
ప్రస్తుత పరిస్థితులను సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించిన అనంతరం విద్యా విధానం పై నిర్ణయం తీసుకుంటామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యాసంస్థల సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని విద్యా ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
అలాగే, ఇప్పటికే ఆమోదించబడిన ప్రణాళికల ప్రకారం పరీక్షలు మరియు అంతర్జాతీయ అంచనా పరీక్షలు ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించబడతాయని స్పష్టం చేసింది.
అవసరమైన పరిస్థితుల్లో విద్యాసంస్థలు ప్రత్యక్ష బోధన నుంచి రిమోట్ లెర్నింగ్కు లేదా ఇతర బోధన విధానాలకు వేగంగా మారేలా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని విద్యాశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఖతార్..!!









