యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం

- May 08, 2026 , by Maagulf
యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం

అబుదాబి: యూఏఈలో రాబోయే రోజుల్లో విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన కొనసాగించాలా లేదా దూర విద్య (రిమోట్ లెర్నింగ్) అమలు చేయాలా అనే విషయం పై మే 10 సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

ప్రస్తుత పరిస్థితులను సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించిన అనంతరం విద్యా విధానం పై నిర్ణయం తీసుకుంటామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యాసంస్థల సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని విద్యా ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

అలాగే, ఇప్పటికే ఆమోదించబడిన ప్రణాళికల ప్రకారం పరీక్షలు మరియు అంతర్జాతీయ అంచనా పరీక్షలు ప్రత్యక్ష పద్ధతిలోనే నిర్వహించబడతాయని స్పష్టం చేసింది.

అవసరమైన పరిస్థితుల్లో విద్యాసంస్థలు ప్రత్యక్ష బోధన నుంచి రిమోట్ లెర్నింగ్‌కు లేదా ఇతర బోధన విధానాలకు వేగంగా మారేలా పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని విద్యాశాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com