బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

- May 09, 2026 , by Maagulf
బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నేత సువేందు అధికారి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని ఐకానిక్ బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుక అత్యంత అట్టహాసంగా జరిగింది.

ప్రమాణ స్వీకారం–గవర్నర్ సమక్షంలో రాష్ట్ర గవర్నర్, సువేందు అధికారితో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (మమతా బెనర్జీ)పై బీజేపీ భారీ విజయం సాధించడంతో, రాష్ట్రంలో తొలిసారిగా కాషాయ జెండా రెపరెపలాడింది.

ఈ వేడుకకు దేశంలోని అగ్రనేతలు తరలివచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితీన్ గడ్కరీ ఈ ఉత్సవానికి హాజరై సువేందును అభినందించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. నందిగ్రామ్ వీరుడిగా పేరుగాంచిన సువేందు అధికారి, ఇప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మమతా బెనర్జీ సుదీర్ఘ పాలనకు చరమగీతం పాడుతూ బీజేపీ సాధించిన ఈ విజయం, మే 9వ తేదీన సువేందు ప్రమాణ స్వీకారంతో అధికారికంగా ఖరారైంది.తెలుగు వార్తలు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com