బహ్రెయిన్లో భవనం పై నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలుడు మృతి..!!
- May 10, 2026
మనామా: బహ్రెయిన్లో ఒక నివాస భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఏడేళ్ల భారతీయ బాలుడు మృతి చెందాడు. మృతుడు డెరిక్ జోసెఫ్ జిస్మోన్.. ప్రవాస భారతీయ దంపతులైన జిస్మోన్ మరియు అక్సాల ఏకైక కుమారుడు. డెరిక్ ఇండియన్ స్కూల్ బహ్రెయిన్లో రెండవ తరగతి చదువుతున్నాడు. అమెరికన్ మిషన్ హాస్పిటల్ సమీపంలోని వారి కుటుంబం నివసిస్తున్న రెండవ అంతస్తు అపార్ట్మెంట్లో ఈ విషాద సంఘటన జరిగింది. ఫ్లాట్లోని తెరిచి ఉన్న కిటికీలోంచి బాలుడు ప్రమాదవశాత్తు కిందపడిపోయినట్లు అధికారులు తెలిపారు.
కిందపడిన వెంటనే, ఇరుగుపొరుగు వారు అతడిని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్కు తరలించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో ప్రత్యేక చికిత్స అందించినప్పటికీ, అతను గాయాలతో మరణించాడు. బాలుడి మృతి బహ్రెయిన్లోని భారతీయ సమాజంలో.. అతని తోటి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులలో తీవ్ర విషాదాన్ని నింపింది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







