బహ్రెయిన్లో భవనం పై నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలుడు మృతి..!!
- May 10, 2026
మనామా: బహ్రెయిన్లో ఒక నివాస భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఏడేళ్ల భారతీయ బాలుడు మృతి చెందాడు. మృతుడు డెరిక్ జోసెఫ్ జిస్మోన్.. ప్రవాస భారతీయ దంపతులైన జిస్మోన్ మరియు అక్సాల ఏకైక కుమారుడు. డెరిక్ ఇండియన్ స్కూల్ బహ్రెయిన్లో రెండవ తరగతి చదువుతున్నాడు. అమెరికన్ మిషన్ హాస్పిటల్ సమీపంలోని వారి కుటుంబం నివసిస్తున్న రెండవ అంతస్తు అపార్ట్మెంట్లో ఈ విషాద సంఘటన జరిగింది. ఫ్లాట్లోని తెరిచి ఉన్న కిటికీలోంచి బాలుడు ప్రమాదవశాత్తు కిందపడిపోయినట్లు అధికారులు తెలిపారు.
కిందపడిన వెంటనే, ఇరుగుపొరుగు వారు అతడిని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్కు తరలించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో ప్రత్యేక చికిత్స అందించినప్పటికీ, అతను గాయాలతో మరణించాడు. బాలుడి మృతి బహ్రెయిన్లోని భారతీయ సమాజంలో.. అతని తోటి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులలో తీవ్ర విషాదాన్ని నింపింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







