బహ్రెయిన్‌లో భవనం పై నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలుడు మృతి..!!

- May 10, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో భవనం పై నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలుడు మృతి..!!

మనామా: బహ్రెయిన్‌లో ఒక నివాస భవనం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఏడేళ్ల భారతీయ బాలుడు మృతి చెందాడు. మృతుడు డెరిక్ జోసెఫ్ జిస్మోన్.. ప్రవాస భారతీయ దంపతులైన జిస్మోన్ మరియు అక్సాల ఏకైక కుమారుడు. డెరిక్ ఇండియన్ స్కూల్ బహ్రెయిన్‌లో రెండవ తరగతి చదువుతున్నాడు. అమెరికన్ మిషన్ హాస్పిటల్ సమీపంలోని వారి కుటుంబం నివసిస్తున్న రెండవ అంతస్తు అపార్ట్‌మెంట్‌లో ఈ విషాద సంఘటన జరిగింది. ఫ్లాట్‌లోని తెరిచి ఉన్న కిటికీలోంచి బాలుడు ప్రమాదవశాత్తు కిందపడిపోయినట్లు అధికారులు తెలిపారు.
కిందపడిన వెంటనే, ఇరుగుపొరుగు వారు అతడిని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌కు తరలించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో ప్రత్యేక చికిత్స అందించినప్పటికీ, అతను గాయాలతో మరణించాడు. బాలుడి మృతి బహ్రెయిన్‌లోని భారతీయ సమాజంలో.. అతని తోటి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com