డెహ్రాడూన్లో ఆర్చి కూలి ఏపీకి చెందిన ఆర్మీ జవాన్ మృతి
- May 10, 2026
డెహ్రాడూన్: అనకాపల్లి జిల్లా వెంకుపాలెం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న మన తెలుగు బిడ్డ, ఆర్మీ నాయక్ రాపేటి పూర్ణచంద్రశేఖర్ (37) డెహ్రాడూన్లో జరిగిన ప్రమాదంలో తుదిశ్వాస విడిచారు. విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం రాత్రి ఆయన ప్రయాణిస్తున్న ట్రక్కుపై ఆర్చి కూలడంతో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో పూర్ణచంద్రశేఖర్ తో పాటు నాగాలాండ్కు చెందిన మరో సైనికుడు కూడా అక్కడికక్కడే మరణించారు.
పూర్ణచంద్రశేఖర్ తన కుటుంబాన్ని కేవలం నెలన్నర క్రితమే డెహ్రాడూన్కు తీసుకెళ్లారు. భార్య గ్రేసి, ఐదేళ్ల కొడుకు, రెండేళ్ల కూతురుతో కలిసి కొత్త జీవితం మొదలుపెట్టే లోపే ఈ ఘోరం జరగడం అందరినీ కలచివేస్తోంది. తన భర్త ఇక లేరనే వార్త విన్న గ్రేసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటికి ఆసరాగా ఉంటాడనుకున్న జవాన్ మరణవార్త విని వెంకుపాలెం గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ ఘటన పై స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్పందించారు. డెహ్రాడూన్ లోని ఆర్మీ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జవాన్ భౌతిక కాయాన్ని సొంత ఊరికి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. జనసేన నాయకులు భీమరశెట్టి రామకృష్ణ బాధిత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. త్వరలోనే పూర్ణచంద్రశేఖర్ పార్థివ దేహాన్ని వెంకుపాలెం తీసుకువచ్చి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







