IPL 2026: బెంగళూరు రాయల్ చాలెంజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ..ముగిసిన ముంబై ఇండియన్స్ కథ
- May 10, 2026
రాయ్ పూర్: ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ విజయం సాధించింది. చివరి బంతి వరకు నరాలు తెగేంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీనే విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 7 వికెట్ల నష్టానికి 166 పరుగులే చేసింది. 167 రన్స్ టార్గెట్ ను ఆర్సీబీ చివరి బంతికి చేజ్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కృనాల్ పాండ్యా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఓ ఎండ్ లో వికెట్లు పడినా కృనాల్ పాండ్యా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లోనే 73 రన్స్ చేసి.. తిలక్ వర్మ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. 2 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్ లో టాప్ కి దూసుకెళ్లింది బెంగళూరు. ఈ మ్యాచ్ లో ఓటమితో టోర్నీ నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







