IPL 2026: బెంగళూరు రాయల్ చాలెంజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ..ముగిసిన ముంబై ఇండియన్స్ కథ
- May 10, 2026
రాయ్ పూర్: ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ విజయం సాధించింది. చివరి బంతి వరకు నరాలు తెగేంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీనే విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 7 వికెట్ల నష్టానికి 166 పరుగులే చేసింది. 167 రన్స్ టార్గెట్ ను ఆర్సీబీ చివరి బంతికి చేజ్ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కృనాల్ పాండ్యా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఓ ఎండ్ లో వికెట్లు పడినా కృనాల్ పాండ్యా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లోనే 73 రన్స్ చేసి.. తిలక్ వర్మ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. 2 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్ లో టాప్ కి దూసుకెళ్లింది బెంగళూరు. ఈ మ్యాచ్ లో ఓటమితో టోర్నీ నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమించింది.
తాజా వార్తలు
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!







