ధోఫార్లో స్ప్రింగ్స్ పునరుద్ధరణ కోసం ప్రత్యేక చర్యలు..!!
- May 11, 2026
సలాలా: ధోఫార్ గవర్నరేట్లోని లోయలు మరియు పర్వత శ్రేణులలో లోతుగా ఉన్న కిలే, డాన్ మరియు అజ్ఘోట్ స్ప్రింగ్స్ నిర్వహణ మరియు పునరుద్ధరణ పనులను పూర్తి చేసినట్లు వ్యవసాయ, మత్స్య మరియు జలవనరుల డైరెక్టరేట్ జనరల్ తెలిపారు. సహజ నీటి వనరులను పరిరక్షించడం, అవి సమాజాలకు ఉపయోగపడేలా చూడటం అనే ప్రయత్నంలో ఈ కృషి ఒక భాగమన్నారు.
సలాలా విలాయత్లోని అడౌనిబ్ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న మంచినీటి వనరు అయిన కిలే బుగ్గ, కాలినడకన సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. సలాలాలోని ఐన్ కోర్ జలపాతం ప్రదేశానికి ఉత్తరాన ఉన్న డాన్ స్ప్రింగ్ కు వెళ్లేందుకు లోయలు మరియు పర్వత వాలుల గుండా నాలుగు కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. రఖ్యూత్ విలాయత్లోని అజ్ఘోట్ స్ప్రింగ్ , అత్యంత కఠినమైన పర్వత మార్గాల వెంబడి సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనివల్ల పునరుద్ధరణ మరియు నిర్వహణ పనులు చాలా కష్టంగా మారాయని జలవనరుల శాఖ డైరెక్టర్ ఇంజనీర్ అలీ బిన్ బఖీత్ బీట్ సయీద్ పేర్కొన్నారు. సలాలాలోని ఐన్ కోర్ జలపాతం ప్రదేశానికి ఉత్తరాన ఉన్న డాన్ స్ప్రింగ్ పునరుద్ధరణను కూడా డైరెక్టరేట్ పూర్తి చేసిందని ఆయన తెలిపారు. సహజ నీటి వనరుల సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలో భాగంగా 2025 నుండి ధోఫార్లోని పలు విలాయత్లలో 17 స్ప్రింగ్ లను మంత్రిత్వ శాఖ పునరుద్ధరించిందని జలవనరుల శాఖ డైరెక్టర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన







