యూఏఈ, ఖతార్, కువైట్లపై జరిగిన దాడులను ఖండించిన సౌదీ..!!
- May 11, 2026
రియాద్ః యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్ల భూభాగాలు మరియు జలాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ద్రోహపూరిత దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. గల్ఫ్ దేశాలు తమ భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి తీసుకుంటున్న అన్ని చర్యలకు సౌదీ అరేబియా మద్దతు తెలిపింది.
"గల్ఫ్ దేశాల భూభాగాలు, జలాలపై జరుగుతున్న బరితెగించిన దాడులను, అలాగే హోర్ముజ్ జలసంధిని మూసివేసే లేదా అంతర్జాతీయ జలమార్గాలకు అంతరాయం కలిగించే ఎలాంటి ప్రయత్నాలనైనా తక్షణమే నిలిపివేయాలని సౌదీ పిలుపునిస్తుంది." అని ఆ ప్రకటన పేర్కొంది. సంబంధిత అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అంతర్జాతీయ సముద్ర మార్గాలకు రక్షణ కల్పించాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







