యూఏఈలో ఇ-ఇన్వాయిసింగ్ సర్వీస్ ప్రొవైడర్ గడువు పొడిగింపు..!!
- May 11, 2026
యూఏఈః యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇ-ఇన్వాయిసింగ్ వ్యవస్థ కింద వ్యాపార సంస్థలు ఒక గుర్తింపు పొందిన సర్వీస్ ప్రొవైడర్ ను (ASP) నియమించుకోవడానికి ఉన్న గడువును జూలై 31 నుండి అక్టోబర్ 30 వరకు పొడిగించింది. ఈ నిర్ణయం వార్షిక ఆదాయం 50 మిలియన్ దిర్హమ్లను మించిన కంపెనీలు మరియు సంస్థలకు వర్తిస్తుంది. యూఏఈ తన ఇ-ఇన్వాయిసింగ్ వ్యవస్థ పైలట్ దశను జూలై 1 నుండి ప్రారంభించనుంది. ఆ తర్వాత, వార్షిక ఆదాయం 50 మిలియన్ దిర్హమ్లను మించిన వ్యాపార సంస్థలతో మొదలుపెట్టి, దశలవారీగా తప్పనిసరి చేయనుంది.
ఇప్పటికే 32 సర్వీస్ ప్రొవైడర్లకు ఆమోదం లభించిందని, మరికొందరు గుర్తింపు ప్రక్రియ చివరి దశలో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రొవైడర్ల సంఖ్యను పెంచడం వల్ల మరింత సమగ్రమైన, పోటీతత్వంతో కూడిన సాంకేతిక పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో సహాయపడుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సర్వీస్ ప్రొవైడర్ల నియామకానికి గడువు పొడిగించినప్పటికీ, ఈ-ఇన్వాయిసింగ్ తప్పనిసరి అమలు కాలపరిమితిలో ఎలాంటి మార్పు లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







