ప్రధాని మోదీతో జ్యువెలరీ అసోసియేషన్ కీలక భేటీ
- May 11, 2026
న్యూ ఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు జ్యువెలరీ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ మారకద్రవ్య నిల్వలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు కొంతకాలం పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని ప్రధాని కోరారు. ఈ నేపథ్యంలో జ్యువెలరీ అసోసియేషన్ ప్రతినిధులు ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రధాని పిలుపుతో సామాన్య ప్రజలు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉంటే, దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆధారపడి ఉన్న జ్యువెలరీ రంగం కుదేలయ్యే ప్రమాదం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సమయంలో కొనుగోళ్లు తగ్గితే వ్యాపారాలు దెబ్బతింటాయని, అనుబంధ రంగాలైన బంగారం తయారీదారులు (Goldsmiths) ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. దేశ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయకుండా, అదే సమయంలో జ్యువెలరీ రంగాన్ని కాపాడేలా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టవచ్చనే అంశంపై అసోసియేషన్ చర్చించనుంది.
అసోసియేషన్ ప్రతినిధులు మే 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా చర్చించబోయే అంశాలు. బంగారంపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల ఉపాధిని కాపాడాలని ప్రధానిని కోరనున్నారు. బంగారం దిగుమతులపై ఉన్న పన్నుల విధానంపై విన్నవించే అవకాశం ఉంది. భౌతిక బంగారానికి బదులుగా డిజిటల్ గోల్డ్ లేదా సోవరిన్ గోల్డ్ బాండ్లను ప్రోత్సహించడం ద్వారా దేశానికి, వ్యాపారులకు ఎలా మేలు జరుగుతుందనే దానిపై ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రధాని మోదీ ఈ సమావేశంలో జ్యువెలరీ రంగానికి ఎలాంటి భరోసా ఇస్తారోనని అటు వ్యాపారులు, ఇటు పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







