ఆయిల్ ట్యాంకర్ హైజాకింగ్.. ఖండించిన బహ్రెయిన్..!!
- May 12, 2026
మనామాః యెమెన్ ప్రాంతీయ జలాల్లో ఎనిమిది మంది ఈజిప్షియన్ నావికులతో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్ను హైజాక్ చేసి, దానిని సోమాలియాలోని పుంట్లాండ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న జలాలకు బలవంతంగా తరలించడాన్ని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటన అంతర్జాతీయ చట్టం, సముద్ర చట్టంపై ఐక్యరాజ్యసమితి ఒప్పందం, సముద్ర భద్రత, సముద్రపు దొంగల నిరోధక ప్రయత్నాలకు సంబంధించిన అంతర్జాతీయ భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించడమే అని పేర్కొంది.
ఈజిప్ట్ నావికులను తక్షణం విడుదల చేయాలని కోరింది. నావికుల విడుదల చేసేలా ప్రపంచ దేశాలు చొరవ చూపాలని బహ్రెయిన్ పిలుపునిచ్చింది. సముద్రపు దొంగతనాలను ఎదుర్కోవడానికి, ప్రాంతీయ మరియు ప్రపంచ స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి అంతర్జాతీయ సహకారం అత్యవసరం అని కూడా పేర్కొంది. ఇలాంటి నేరపూరిత చర్యలు అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాల భద్రతకు ముప్పు కలిగిస్తాయని, ప్రాంతీయ జలాల్లో భద్రతను పరిరక్షించే ప్రయత్నాలను దెబ్బతీస్తాయని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- కేరళం సీఎం పదవి ఎవరికీ దక్కుతుందో?
- ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ వాయిదా..!!
- సాహెల్ యాప్ ద్వారా విమాన ప్రయాణ ఫిర్యాదులు నమోదు..!!
- ఒమన్కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ పిసే నియామకం..!!
- మలిహా రోడ్డు నుండి 3-లేన్ల బ్రిడ్జిని నిర్మించనున్న షార్జా..!!
- దుబాయ్ లో ‘రెడ్ కార్పెట్’.. 3.4 సెకన్లలో క్లియరెన్స్..!!
- ఖుబా మసీదు..ఆటోబస్ షటిల్ సేవలు ప్రారంభం..!!
- ఆయిల్ ట్యాంకర్ హైజాకింగ్.. ఖండించిన బహ్రెయిన్..!!
- చంద్రబాబు ఇంటి పై పేర్ని నాని సంచలన ఆరోపణలు
- వెస్ట్ బెంగాల్: జూన్ 1 నుంచి ఉచిత బస్సు ప్రయాణం









