ఖుబా మసీదు..ఆటోబస్ షటిల్ సేవలు ప్రారంభం..!!
- May 12, 2026
మదీనాః మదీనా ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సహకారంతో రవాణా సాధారణ ప్రాధికార సంస్థ (TGA) మదీనాలోని ఖుబా మసీదు లోపలి ప్రాంగణంలో ఆటోమేటిక్ “రోబో బస్” షటిల్ బస్సు సేవలను పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించింది. ఇది సందర్శకులకు వినూత్నమైన మరియు సురక్షితమైన రవాణాను అందిస్తుందని అధికారులు తెలిపారు. గరిష్టంగా 20 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించే సౌకర్యం ఉంటుందన్నారు.
ఆధునిక సెన్సార్లు మరియు హై-రిజల్యూషన్ కెమెరాల మద్దతుతో ఏఐ వ్యవస్థ ద్వారా ఇది రన్ అవుతుందని ప్రకటించారు. ఈ రోబో బస్ కోసం ఖుబా మసీదు లోపలి ప్రాంగణంలో 700 మీటర్ల వరకు ప్రత్యేక మార్గాన్ని రూపొందించారు. ఈ పైలెట్ ప్రాజెక్టు 60 రోజులపాటు కొనసాగనుంది.
రోబో బస్ అనేది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కోసం రూపొందించిన ఒక L4 ఆటోమెటిక్ విద్యుత్ ఆధారిత డ్రైవర్లేని మినీబస్. ఈ వాహనాలు నావిగేట్ చేయడానికి అధునాతన LiDAR, కెమెరాలు మరియు AIని ఉపయోగిస్తారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







