మలిహా రోడ్డు నుండి 3-లేన్ల బ్రిడ్జిని నిర్మించనున్న షార్జా..!!
- May 12, 2026
యూఏఈః మలిహా రోడ్డును, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డు వైపు వెళ్లే మార్గంతో కలిపే ఒక కొత్త 3-లేన్ల బ్రిడ్జి నిర్మాణానికి షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ఆమోదం తెలిపారు. ఈ బ్రిడ్జి షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్ మరియు మలిహా రోడ్డు కలిసే ఇంటర్ సెక్షన్ వద్ద నిర్మించబడుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి Dh140 మిలియన్ల వ్యయం అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభమై, ఒక సంవత్సరంలోపు పూర్తి అయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చాక ప్రయాణ సమయం సుమారు 9 నిమిషాల వరకు తగ్గుతుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







