ఒమన్‌కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ పిసే నియామకం..!!

- May 12, 2026 , by Maagulf
ఒమన్‌కు తదుపరి  భారత  రాయబారిగా ప్రశాంత్ పిసే నియామకం..!!

మస్కట్: ప్రస్తుతం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా సేవలందిస్తున్న ప్రశాంత్ పిసే, ఒమన్ సుల్తానేట్‌కు భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. 1995 బ్యాచ్‌కు చెందిన భారత విదేశాంగ సేవా (IFS) అధికారి అయిన పిసేకు, మిడిలీస్టు మరియు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో పనిచేసిన అనుభవం ఉంది.
ఈజిప్ట్, లిబియా, ట్యునీషియా మరియు ఇరాక్‌లలో ఆయన గతంలో విధులు నిర్వర్తించారు. జపాన్, మారిషస్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లలో కూడా ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. తాజా నియామకానికి ముందు.. పిసే ఇరాక్‌కు భారత రాయబారిగా సేవలందించారు. ఆ తర్వాత, విదేశాంగ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మస్కట్‌లో పిసే త్వరలోనే బాధ్యతలను స్వీకరించనున్నారని అధికారులు ప్రకటించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com