ఒమన్కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ పిసే నియామకం..!!
- May 12, 2026
మస్కట్: ప్రస్తుతం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా సేవలందిస్తున్న ప్రశాంత్ పిసే, ఒమన్ సుల్తానేట్కు భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. 1995 బ్యాచ్కు చెందిన భారత విదేశాంగ సేవా (IFS) అధికారి అయిన పిసేకు, మిడిలీస్టు మరియు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో పనిచేసిన అనుభవం ఉంది.
ఈజిప్ట్, లిబియా, ట్యునీషియా మరియు ఇరాక్లలో ఆయన గతంలో విధులు నిర్వర్తించారు. జపాన్, మారిషస్ మరియు యునైటెడ్ కింగ్డమ్లలో కూడా ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. తాజా నియామకానికి ముందు.. పిసే ఇరాక్కు భారత రాయబారిగా సేవలందించారు. ఆ తర్వాత, విదేశాంగ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మస్కట్లో పిసే త్వరలోనే బాధ్యతలను స్వీకరించనున్నారని అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







