ఒమన్కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ పిసే నియామకం..!!
- May 12, 2026
మస్కట్: ప్రస్తుతం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా సేవలందిస్తున్న ప్రశాంత్ పిసే, ఒమన్ సుల్తానేట్కు భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. 1995 బ్యాచ్కు చెందిన భారత విదేశాంగ సేవా (IFS) అధికారి అయిన పిసేకు, మిడిలీస్టు మరియు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో పనిచేసిన అనుభవం ఉంది.
ఈజిప్ట్, లిబియా, ట్యునీషియా మరియు ఇరాక్లలో ఆయన గతంలో విధులు నిర్వర్తించారు. జపాన్, మారిషస్ మరియు యునైటెడ్ కింగ్డమ్లలో కూడా ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. తాజా నియామకానికి ముందు.. పిసే ఇరాక్కు భారత రాయబారిగా సేవలందించారు. ఆ తర్వాత, విదేశాంగ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మస్కట్లో పిసే త్వరలోనే బాధ్యతలను స్వీకరించనున్నారని అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







