అమెరికా-ఇరాన్ చర్చలు: పాకిస్థాన్ ‘డబుల్ గేమ్’పై ట్రంప్ ఆగ్రహం
- May 12, 2026
అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్, వాస్తవానికి ఇరాన్కు తొత్తుగా మారుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇరాన్ సైనిక విమానాలకు తన విమానాశ్రయాల్లో ఆశ్రయం కల్పించడం ద్వారా పాక్ తన తటస్థ వైఖరిని విడనాడిందని అమెరికా రక్షణ నిపుణులు భావిస్తున్నారు. “ఒకవైపు అమెరికా నుంచి ఆర్థిక సాయం పొందుతూ, మరోవైపు అమెరికా శత్రువులకు రహస్యంగా సహకరించడం పాక్కు అలవాటే” అని ట్రంప్ సన్నిహితులు విమర్శిస్తున్నారు.
పాకిస్థాన్ పాత్రపై నమ్మకం సన్నగిల్లిన వేళ, మే 13 నుంచి జరగనున్న ట్రంప్ చైనా పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమాసియాలో చైనాకు ఉన్న ప్రభావాన్ని ఉపయోగించి ఇరాన్ను దారికి తెచ్చుకోవాలని ట్రంప్ యోచిస్తున్నారు. పాకిస్థాన్ను పక్కన పెట్టి, నేరుగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సహాయంతో ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమానికి చెక్ పెట్టాలని అమెరికా భావిస్తోంది.ఇరాన్ పంపిన ప్రతిపాదనలను “చెత్త” (Trash) గా అభివర్ణించిన ట్రంప్, ఆ దేశంపై కనికరం చూపే ప్రసక్తే లేదని సంకేతాలిచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందం కేవలం పేరుకే ఉందని, ఇరాన్ తన మొండి వైఖరిని మార్చుకోకపోతే వైమానిక దాడులే ఏకైక మార్గమని ఆయన హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టును సడలించేందుకు సైనిక చర్య చేపట్టాలని అమెరికా రక్షణ శాఖలోని ఒక వర్గం తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది. ఇరాన్ను చర్చల ద్వారా మార్చలేమని, బాంబు దాడులతోనే ఆ దేశ ఆర్థిక, సైనిక వెన్నెముకను విరచాలని వీరు భావిస్తున్నారు. దశాబ్దాలుగా ఆంక్షలను తట్టుకున్న ఇరాన్ అంత త్వరగా లొంగదని, మరికొంత కాలం చర్చలు జరపాలని వీరు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ చర్చలు: పాకిస్థాన్ ‘డబుల్ గేమ్’పై ట్రంప్ ఆగ్రహం
- ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు డ్రైవర్లు సజీవ దహనం
- దుబాయ్లో ప్రైవేట్ పాఠశాలలకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు
- ఏపీలో రేపటి నుంచి ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్
- కాషాయమయంగా కొండగట్టు దేవాలయం
- కేరళం సీఎం పదవి ఎవరికీ దక్కుతుందో?
- ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ వాయిదా..!!
- సాహెల్ యాప్ ద్వారా విమాన ప్రయాణ ఫిర్యాదులు నమోదు..!!
- ఒమన్కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ పిసే నియామకం..!!
- మలిహా రోడ్డు నుండి 3-లేన్ల బ్రిడ్జిని నిర్మించనున్న షార్జా..!!









