రాస్ అల్ ఖైమా డ్యామ్లో జారిపడి యువకుడు మృతి..!!
- May 12, 2026
రాస్ అల్ ఖైమా: రాస్ అల్ ఖైమాలోని అధాన్ డ్యామ్లో జరిగిన ఒక విషాదకరమైన ఘటనలో 16 ఏళ్ల ఎమిరేటీ బాలుడు నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన యువకుడిని రషీద్ జుమా అలీ అల్ మజ్రూయీగా గుర్తించారు. వారాంతపు విహారయాత్ర కోసం తన కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.
అతని బంధువు కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పెరిగిన నీటిమట్టం మరియు చిక్కటి బురద వల్ల అతన్ని సురక్షితంగా బయటకు తీయడం సాధ్యం కాలేదు. చివరికి రషీద్ను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు అప్పటికే చేరుకునేసరికే అతను మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు, ఈ ఘటన జరిగిన ప్రదేశంలో భద్రతా పరమైన సదుపాయాలు లేకపోవడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. భారీ వర్షాల తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పటికీ, డ్యామ్కు పూర్తిగా కంచె లేదని స్థానికులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా నివారించడానికి సిమెంట్ బ్యారియర్లు లేదా ఇనుప కంచెలు నిర్మించడం, నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడం, స్పష్టమైన హెచ్చరిక బోర్డులను పెట్టడం వంటివి వారి డిమాండ్లలో ఉన్నాయి.
తాజా వార్తలు
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!







