రాస్ అల్ ఖైమా డ్యామ్లో జారిపడి యువకుడు మృతి..!!
- May 12, 2026
రాస్ అల్ ఖైమా: రాస్ అల్ ఖైమాలోని అధాన్ డ్యామ్లో జరిగిన ఒక విషాదకరమైన ఘటనలో 16 ఏళ్ల ఎమిరేటీ బాలుడు నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన యువకుడిని రషీద్ జుమా అలీ అల్ మజ్రూయీగా గుర్తించారు. వారాంతపు విహారయాత్ర కోసం తన కుటుంబంతో కలిసి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.
అతని బంధువు కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పెరిగిన నీటిమట్టం మరియు చిక్కటి బురద వల్ల అతన్ని సురక్షితంగా బయటకు తీయడం సాధ్యం కాలేదు. చివరికి రషీద్ను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు అప్పటికే చేరుకునేసరికే అతను మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు, ఈ ఘటన జరిగిన ప్రదేశంలో భద్రతా పరమైన సదుపాయాలు లేకపోవడంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. భారీ వర్షాల తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పటికీ, డ్యామ్కు పూర్తిగా కంచె లేదని స్థానికులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా నివారించడానికి సిమెంట్ బ్యారియర్లు లేదా ఇనుప కంచెలు నిర్మించడం, నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడం, స్పష్టమైన హెచ్చరిక బోర్డులను పెట్టడం వంటివి వారి డిమాండ్లలో ఉన్నాయి.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







