'2.ఓ' చిత్రీకరణ చెన్నైలో మళ్లీ ప్రారంభo...
- August 07, 2016
శంకర్ దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం '2.ఓ' చిత్రీకరణ చెన్నైలో మళ్లీ ప్రారంభమయింది. 'రోబో' ఘనవిజయం సాధించిన నేపథ్యంలో దాని సీక్వెల్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రజనీకాంత్ సరసన ఎమిజాక్సన్ నటిస్తోంది. ప్రతినాయకుడి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ కనిపించనున్నారు. దిల్లీలోని నెహ్రూ స్టేడియంలో ఫుట్బాల్ పోటీలు జరుగుతున్నట్లు, అందులో అక్షయ్కుమార్ కనిపించేలా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. మరోవైపు ప్రతినాయకుడిగా అక్షయ్కుమార్ రూపం ఆన్లైన్లో చక్కర్లు కొట్టింది. 'కబాలి' చిత్రీకరణలో బిజీగా ఉండటంతో ఈ సినిమా చిత్రీకరణలో రజనీకాంత్ పాల్గొనలేదు. ఆయనకు సంబంధించిన సన్నివేశాలను మినహాయించి ఇతర నటీనటులపై మాత్రం చిత్రీకరించారు. యాభై శాతం షూటింగ్ పూర్తయినట్లు దర్శకుడు శంకర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ అమెరికాలో విశ్రాంతి తీసుకుని గత వారం చెన్నై వచ్చారు. మళ్లీ '2.ఓ' చిత్రీకరణ మొదలుపెట్టారు. ఆదివారం ఉదయం చెన్నైలోని అయనావరంలో చిత్రీకరణ కొనసాగించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనరుకు ప్రజలు వినతులు సమర్పించే సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందులోనూ రజనీకాంత్ పాల్గొనలేదు. ఆ ప్రాంతానికి రజనీ అభిమానులు, స్థానికులు భారీసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా అయనావరం పోర్చీస్ రోడ్డులో ట్రాఫిక్ను మళ్లించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







