తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా..బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం..

- May 13, 2026 , by Maagulf
తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా..బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం..

చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం బలపరీక్ష నెగ్గింది. బుధవారం ఉదయం ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. విజయ్ ప్రభుత్వానికి 144 మంది సభ్యులు మద్దతు పలికారు. 22 మంది సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు తెలిపాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే సభ నుంచి వాకౌట్ చేశాయి. విజయ్ ప్రభుత్వానికి అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో అసెంబ్లీలో హైడ్రామా నడిచింది. కొద్దిసేపటికి మొత్తంగా అన్నాడీఎంకే పార్టీలోని షణ్ముగం నేతృత్వంలోని 30మంది ఎమ్మెల్యేలు కూడా బయటి నుంచి మద్దతు ఇవ్వడంతో విజయ్ ప్రభుత్వం బలపరీక్ష నెగ్గినట్లు జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com