కువైటైజేషన్ ఆందోళనలు..ప్రవాసుల కోసం రుణ నిబంధనలు కఠినతరం..!!
- May 15, 2026
కువైట్ః కువైట్లోని స్థానిక బ్యాంకులు వ్యక్తిగత రుణ పరిమితులను తగ్గించడం మరియు రుణ మొత్తాలను ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలకు ముడిపెట్టడం ద్వారా నివాసితులు మరియు కువైటీయేతరుల కోసం రుణ విధానాలను కఠినతరం చేయడం ప్రారంభించాయి. కొన్ని బ్యాంకులు ఇప్పుడు రుణ మొత్తం, రుణగ్రహీతకు రాబోయే పదవీ విరమణ బోనస్ విలువలోనే ఉండాలని షరతులు పెడుతున్నాయని తెలిసింది.
కువైటైజేషన్ విధానాలు లేదా ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కోతలకు గురయ్యే అవకాశం ఉన్న రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో బ్యాంకులు మరింత జాగ్రత్తతో వ్యవహారిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రంగాల్లోని ప్రవాస ఉద్యోగులకు రుణాలను బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. అదే సమయంలో సురక్షితమైన ఉద్యోగాలు, అధిక జీతాలు, పెద్ద కంపెనీలలో పనిచేస్తున్న వారిపై బ్యాంకులు ఎక్కువ దృష్టి సారిస్తున్నాయని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి.
కొన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాల కోసం కనీస జీతం నిబంధనను KD 500 కంటే ఎక్కువగా పెంచినట్లు తెలుస్తోంది. గతంలో KD 250 - KD 300 మధ్య జీతాలు పొందుతున్న వారికి రుణాలు ఇచ్చేవారు. అయితే, ఆరోగ్య సంరక్షణ, ఇంజనీరింగ్, విద్య, చమురు పరిశ్రమ వంటి ప్రత్యేక రంగాలలోని నిపుణులకు మినహాయింపులు ఉంటాయని బ్యాంకులు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







