భారత జెండా ఉన్న నౌక పై దాడిని ఖండించిన యూఏఈ..!!
- May 15, 2026
మనామాః ఒమన్ తీరంలో భారత జెండా ఉన్న నౌకను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రవాద దాడిని యూఏఈ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన సముద్ర భద్రతకు, ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు అని పేర్కొంది. ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి దాడులు ప్రపంచ సముద్రయాన భద్రతకు ముప్పు కలిగించడానికి ఉద్దేశించిన ఒక తీవ్రమైన ఉద్రిక్తతగా అభివర్ణించింది.
ఇలాంటి ఘటనలు కీలక సముద్ర మార్గాలకు ప్రమాదం కలిగిస్తాయని, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రతపై ప్రభావం చూపుతాయని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. భారత నౌకలను రక్షించడం, ఈ ప్రాంతంలో సముద్ర కార్యకలాపాల భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా జరుగుతున్న ప్రయత్నాలకు తన మద్దతు ఉంటుందని యూఏఈ స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ నౌకా మార్గాలలో భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యత ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- చైనాలో ట్రంప్ పర్యటన..తైవాన్ అంశంపై ‘రెడ్ లైన్’ దాటొద్దని హెచ్చరిక!
- భారత్ నుంచి 5 దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ
- కువైటైజేషన్ ఆందోళనలు..ప్రవాసుల కోసం రుణ నిబంధనలు కఠినతరం..!!
- భారత జెండా ఉన్న నౌక పై దాడిని ఖండించిన యూఏఈ..!!
- యూఏఈలో మోదీ: మహమ్మద్ బిన్ జాయెద్తో ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఉచిత ప్రవేశాన్ని ప్రకటించిన ఖతార్ మ్యూజియమ్స్..!!
- ఫిలిప్పీన్స్ కార్మికులకు వైద్య పరీక్ష తప్పనిసరి..!!
- ఏడుగురు సౌదీలతో సహా 1750 మంది ఖైదీలు విడుదల..!!
- పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..
- పీ-8ఐ యుద్ధ విమానాల భారీ నిర్వహణ కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఒప్పందం









