భారత జెండా ఉన్న నౌక పై దాడిని ఖండించిన యూఏఈ..!!
- May 15, 2026
మనామాః ఒమన్ తీరంలో భారత జెండా ఉన్న నౌకను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రవాద దాడిని యూఏఈ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన సముద్ర భద్రతకు, ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు అని పేర్కొంది. ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి దాడులు ప్రపంచ సముద్రయాన భద్రతకు ముప్పు కలిగించడానికి ఉద్దేశించిన ఒక తీవ్రమైన ఉద్రిక్తతగా అభివర్ణించింది.
ఇలాంటి ఘటనలు కీలక సముద్ర మార్గాలకు ప్రమాదం కలిగిస్తాయని, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రతపై ప్రభావం చూపుతాయని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. భారత నౌకలను రక్షించడం, ఈ ప్రాంతంలో సముద్ర కార్యకలాపాల భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా జరుగుతున్న ప్రయత్నాలకు తన మద్దతు ఉంటుందని యూఏఈ స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ నౌకా మార్గాలలో భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యత ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







