భారత జెండా ఉన్న నౌక పై దాడిని ఖండించిన యూఏఈ..!!

- May 15, 2026 , by Maagulf
భారత జెండా ఉన్న నౌక పై దాడిని ఖండించిన యూఏఈ..!!

మనామాః ఒమన్ తీరంలో భారత జెండా ఉన్న నౌకను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రవాద దాడిని యూఏఈ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన సముద్ర భద్రతకు, ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు అని పేర్కొంది. ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి దాడులు ప్రపంచ సముద్రయాన భద్రతకు ముప్పు కలిగించడానికి ఉద్దేశించిన ఒక తీవ్రమైన ఉద్రిక్తతగా అభివర్ణించింది.  

ఇలాంటి ఘటనలు కీలక సముద్ర మార్గాలకు ప్రమాదం కలిగిస్తాయని, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రతపై ప్రభావం చూపుతాయని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. భారత నౌకలను రక్షించడం, ఈ ప్రాంతంలో సముద్ర కార్యకలాపాల భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా జరుగుతున్న ప్రయత్నాలకు తన మద్దతు ఉంటుందని యూఏఈ స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ నౌకా మార్గాలలో భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యత ఉందని తెలిపింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com