ఏపీకి వడగాలుల హెచ్చరిక..
- May 17, 2026
అమరావతి: ఏపీలో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కంభంలో అత్యధికంగా 43.3°C ఉష్ణోగ్రత నమోదైంది.14 జిల్లాల్లోని 65 మండలాల్లో 40°C పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అవడం ఎండల తీవ్రతకు అద్దం పడుతుంది. ఇక, రేపు ఎండలు మరింత మండిపోనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 15 జిల్లాల్లో 42-44°C వరకు టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉందంది. ఇక, 28 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. మంగళవారం 84 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 245 మండలాల్లో సాధారణ వడగాలుల ప్రభావం ఉండనుంది. తీవ్రమైన ఎండలు, వేడిగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
అనవసరంగా ఎండలో తిరగొద్దని, ఇంట్లోనే ఉండాలని చెప్పింది. అత్యవసరం అయితేనే బయటకు రావాలంది. ఎండలో తిరగాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా బీపీ, షుగర్, గుండె వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలంది. వడ దెబ్బ బారిన పడకుండా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పింది.
మరోవైపు మన్యం, అల్లూరి, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాల కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడొద్దని సూచించింంది. పంట పొలాల్లో పని చేసే రైతులు, పశుకాపరులు అప్రమత్తంగా ఉండాలంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







