ఏపీకి వడగాలుల హెచ్చరిక..
- May 17, 2026
అమరావతి: ఏపీలో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కంభంలో అత్యధికంగా 43.3°C ఉష్ణోగ్రత నమోదైంది.14 జిల్లాల్లోని 65 మండలాల్లో 40°C పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అవడం ఎండల తీవ్రతకు అద్దం పడుతుంది. ఇక, రేపు ఎండలు మరింత మండిపోనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 15 జిల్లాల్లో 42-44°C వరకు టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉందంది. ఇక, 28 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. మంగళవారం 84 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 245 మండలాల్లో సాధారణ వడగాలుల ప్రభావం ఉండనుంది. తీవ్రమైన ఎండలు, వేడిగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
అనవసరంగా ఎండలో తిరగొద్దని, ఇంట్లోనే ఉండాలని చెప్పింది. అత్యవసరం అయితేనే బయటకు రావాలంది. ఎండలో తిరగాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా బీపీ, షుగర్, గుండె వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలంది. వడ దెబ్బ బారిన పడకుండా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పింది.
మరోవైపు మన్యం, అల్లూరి, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాల కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడొద్దని సూచించింంది. పంట పొలాల్లో పని చేసే రైతులు, పశుకాపరులు అప్రమత్తంగా ఉండాలంది.
తాజా వార్తలు
- ఏపీకి వడగాలుల హెచ్చరిక..
- ‘ఐక్య ధైర్య సేన సమితి’ మొదలుపెట్టిన మంచు మనోజ్
- యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు 3 డ్రోన్లను అడ్డుకున్నాయి
- తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. మే 20 వరకు జాగ్రత్త..
- ప్రముఖ సీనియర్ నిర్మాత కే రజన్ ఆత్మహత్య!
- ఈద్ అల్ అదా 2026 తేదీ ఖరారు చేసిన దేశాలు..
- అబుదాబి బరాకా అణు విద్యుత్ కేంద్రం వద్ద డ్రోన్ దాడి..అగ్నిప్రమాదం
- చిల్కూరు బాలాజీ ఆలయం పై అమెరికా సెనేటర్ అనుచిత వ్యాఖ్యలు
- విదేశీ నియామకాలను అధిగమించిన బహ్రెయిన్ ఉద్యోగాలు..!!
- జీసీసీ ‘వాఫెడ్’: ప్రవాస కార్మికులకు వైద్య పరీక్షలు..!!









