యాదగిరిగుట్ట వేద పాఠశాల శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
- May 17, 2026
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అర్చకులు కలిసి వేద పాఠశాల శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఈ నెల 23న యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వేద పాఠశాల నిర్మాణంతో పాటు దేవస్థానానికి సంబంధించిన ఇతర అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై శంకుస్థాపన చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, వేద విద్యాభివృద్ధి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి వద్దకు వెళ్లిన ప్రతినిధి బృందంలో ఎంపీలు వేమ్ నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, యాదగిరిగుట్ట ఆలయ ఈవో భవాని శంకర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాప్టిల్స్ ఘన విజయం..
- ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం..
- యాదగిరిగుట్ట వేద పాఠశాల శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
- దేశంలో ఎడ్యు కేషన్ సిస్టమ్ పై రాహుల్ కీలక వ్యాఖ్యలు
- ఈద్ అల్ అధా తేదీలు ప్రకటింపు
- ఏపీకి వడగాలుల హెచ్చరిక..
- ‘ఐక్య ధైర్య సేన సమితి’ మొదలుపెట్టిన మంచు మనోజ్
- యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు 3 డ్రోన్లను అడ్డుకున్నాయి
- తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. మే 20 వరకు జాగ్రత్త..
- ప్రముఖ సీనియర్ నిర్మాత కే రజన్ ఆత్మహత్య!









