కశ్మీర్‌ అంశంపై ప్రతిపక్షాల విమర్శలు

- August 08, 2016 , by Maagulf
కశ్మీర్‌ అంశంపై ప్రతిపక్షాల విమర్శలు

కశ్మీర్‌ అంశంపై ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌తో సమావేశమై కశ్మీర్‌ పరిస్థితులపై చర్చించారు.హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీని భద్రతా బలగాలు మట్టుబెట్టిన నేపథ్యంలో కశ్మీర్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 55 మంది మృతిచెందగా.. మరో 3వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ పరిస్థితిపై పార్లమెంట్‌లో విపక్షాలు మండిపడ్డాయి. 'ఓ వైపు అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా సరే కశ్మీర్‌ ఉద్రిక్తతపై ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేద'ంటూ రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ విమర్శించారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com