ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నా సుష్మాస్వరాజ్..
- August 08, 2016
కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. వచ్చే నెలలో న్యూయార్క్లోని ఐరాస కార్యాలయంలో 71వ జనరల్ అసెంబ్లీ జరగనుంది. ఈ సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్ 26న కేంద్రమంత్రి సుష్మ ప్రసంగించనున్నారు.గత రెండేళ్లుగా ఈ సమావేశాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీఈ సారి హాజరవడం లేదు. దీంతో ఈ ఏడాది సమావేశాలకు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ హాజరవనున్నారు. సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు ఈ జనరల్ డిబేట్ కొనసాగనుంది. సెప్టెంబర్ 26న జరిగే వార్షిక ఉన్నతస్థాయి చర్చలో సుష్మాస్వరాజ్ ప్రసంగిస్తారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటారు. సెప్టెంబర్ 21న ఆయన మాట్లాడనున్నారు.
2014లో జరిగిన ఐరాస సమావేశాల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ.. అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపాలని ప్రపంచ నేతలను కోరిన విషయం తెలిసిందే. అందుకు సమితి ఆమోదం తెలపడంతో జూన్ 21న ఏటా యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్







