ఒమన్లో నిర్మాణ సామగ్రి ధరలపై సీపీఏ కీలక ప్రకటన..!!
- May 19, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో నిర్మాణ సామగ్రి ధరలకు సంబంధించి వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీపీఏ) ఒక ప్రకటన జారీ చేసింది. నిర్మాణ సామగ్రి ధరలు, స్థానిక మార్కెట్లలో వాటి పెరిగిన ధరల గురించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న విషయాలను వినియోగదారుల పరిరక్షణ అథారిటీ పర్యవేక్షిస్తోందన్నారు.
ధరల పెరుగుదల ప్రకటన ఫేక్ అని, అది వాస్తవ ధరల స్థాయిలను సరిగ్గా ప్రతిబింబించడం లేదని అథారిటీ స్పష్టం చేసింది. ఉదాహరణకు, ఈ సంవత్సరం (2026) ఫిబ్రవరి మరియు మే నెలల మధ్య ఐరన్ ధర కేవలం 12 శాతం, సిమెంట్ ధరలు 18 శాతం పెరిగాయని తెలిపింది.
స్థానిక సామగ్రితో సహా భవన నిర్మాణ సామగ్రి ధరలు సరఫరా మరియు డిమాండ్, ఇతర పరిస్థితుల కారణంగా ఆయా ప్రాంతాలలోని పరిస్థితులను బట్టి వివిధ స్థాయిలలో ధరలు పెరుగుదల ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితిని నిరోధించడానికి, వివిధ మార్కెట్లలో భవన నిర్మాణ సామగ్రి ధరలను పర్యవేక్షించేందుకు అథారిటీ తన పర్యవేక్షణ ప్రయత్నాలను ముమ్మరం చేసిందని తెలిపింది. ఈ సందర్భంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్న అనేక సంస్థలను గుర్తించడం జరిగిందని, వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







