ఖతార్లోని CBSE టాపర్లను సన్మానించిన ICC..!!
- May 21, 2026
దోహా: ఖతార్ లోని భారత రాయబార కార్యాలయ ఆధ్వర్యంలో పనిచేసే 'ఇండియన్ కల్చరల్ సెంటర్' (ICC) వివిధ పాఠశాలలకు చెందిన 10వ మరియు 12వ తరగతి CBSE టాపర్లను సన్మానించింది. ICC అశోక హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఖతార్లోని భారత రాయబారి H.E. విపుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసి, అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని శుభాకాంక్షలు తెలియజేశారు. వారిని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు చూపిన అంకితభావం, అందించిన సహకారాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ICC అధ్యక్షుడు A.P. మణికందన్, ప్రధాన కార్యదర్శి అబ్రహం కె. జోసెఫ్, ఉపాధ్యక్షుడు శాంతను దేశ్పాండే, సలహా మండలి ఛైర్మన్ P. N. బాబు రాజన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







