నెలరోజుల్లో 42వేలకుపైగా తనిఖీలు చేసిన కామర్స్ మినిస్ట్రీ..!!
- May 21, 2026
మక్కా: వాణిజ్య మంత్రిత్వ శాఖ నెలరోజుల్లో మక్కా మరియు మదీనా ప్రాంతాలలోని వాణిజ్య సంస్థలు మరియు రిటైల్ అవుట్లెట్లలో 42,791 తనిఖీలు నిర్వహించింది. ప్రస్తుత హజ్ సీజన్ కోసం రూపొందించిన పర్యవేక్షణ ప్రణాళికలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిత్యావసర వస్తువుల స్టాక్ తోపాటు వినియోగదారులకు ప్రత్యామ్నాయాలు, యాత్రికుల విభిన్న అవసరాలను తీర్చడానికి స్థానిక మార్కెట్ల సంసిద్ధతను బలోపేతం చేయడం తనిఖీల లక్ష్యమని తెలిపింది.
తనిఖీల్లో భాగంగా రిటైల్ కేంద్రాలు, పబ్లిక్ మార్కెట్లు, ఆభరణాల దుకాణాలలో కూడా ఇన్స్పెక్టర్లు పరిశీలించినట్లు పేర్కొన్నది. వాణిజ్య నిబంధనల అమలు, యాత్రికులకు నాణ్యమైన సేవలు అందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. హజ్ సీజన్ మొత్తం తనిఖీలను ముమ్మరం చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







