ట్రైనీ ఐఏఎస్ అధికారులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దిశానిర్దేశం
- May 25, 2026
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సోమవారం లోక్ భవన్లో 2025 బ్యాచ్కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రజలతో అనుసంధానమై బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ సుపరిపాలన సాధనకు కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ప్రజాసేవలో నిజాయితీ, నిబద్ధత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని సమర్థవంతమైన పరిపాలన అందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని ట్రైనీ అధికారులకు సూచించారు. సేవాభావంతో పని చేస్తేనే మంచి పరిపాలన సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
శిక్షణలో ఉన్న ఎట్టబోయిన సాయి శివాని, సచిన్ బసవరాజ్ గుత్తూర్, పోతరాజు హరి ప్రసాద్, పారస్ కుమార్, పి. సురేష్, నెలటూరు శ్రీకాంత్ రెడ్డి గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిశోర్, ఎంసీఆర్ హెచ్ఆర్డీ వైస్ చైర్పర్సన్ శాంతి కుమారి, కోర్స్ డైరెక్టర్ డా. కందుకూరి ఉషారాణి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్
- ట్రైనీ ఐఏఎస్ అధికారులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దిశానిర్దేశం
- బహ్రెయిన్ లో డెలివరీ మోటార్ బైక్ల నియంత్రణకు అధ్యయనం..!!
- దుబాయ్ ఫ్లైట్ ఎక్కే గంటల ముందు..కేరళలో దంపతులు అనుమానస్పద మృతి..!!
- ఏప్రిల్లో అబ్షర్ లో 16.5 మిలియన్లకు పైగా ఎలక్ట్రానిక్ లావాదేవీలు..!!
- జి.వి.శ్రీనివాస్ ను ఘనంగా సత్కారించిన ISC ఒమన్..!!









