ట్రైనీ ఐఏఎస్ అధికారులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దిశానిర్దేశం
- May 25, 2026
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సోమవారం లోక్ భవన్లో 2025 బ్యాచ్కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రజలతో అనుసంధానమై బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ సుపరిపాలన సాధనకు కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ప్రజాసేవలో నిజాయితీ, నిబద్ధత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని సమర్థవంతమైన పరిపాలన అందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని ట్రైనీ అధికారులకు సూచించారు. సేవాభావంతో పని చేస్తేనే మంచి పరిపాలన సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
శిక్షణలో ఉన్న ఎట్టబోయిన సాయి శివాని, సచిన్ బసవరాజ్ గుత్తూర్, పోతరాజు హరి ప్రసాద్, పారస్ కుమార్, పి. సురేష్, నెలటూరు శ్రీకాంత్ రెడ్డి గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిశోర్, ఎంసీఆర్ హెచ్ఆర్డీ వైస్ చైర్పర్సన్ శాంతి కుమారి, కోర్స్ డైరెక్టర్ డా. కందుకూరి ఉషారాణి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







